చెన్నై కింగ్స్‌కు ఊరట... హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు.. కానీ..?

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (17:07 IST)
చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు కరోనా కాస్త ఊరటనిచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల కరోనా బారినపడ్డ ఇద్దరు ఆటగాళ్లతో పాటు మిగతా సహాయ సిబ్బందికి తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్‌గా వచ్చినట్లు తెలిసింది. దీంతో హమ్మయ్య అంటూ చెన్నై ఆటగాళ్లతో పాటు క్రికెట్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

ఇటీవల జట్టులో ఇద్దరు ఆటగాళ్లు సహా పది మందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో టీమ్‌ మేనేజ్‌మెంట్‌, బీసీసీఐతో పాటు మిగతా ప్రాంఛైజీలు కూడా షాక్‌కు గురయ్యాయి. తాజాగా సీఎస్‌కే అభిమానులకు పెద్ద ఉపశమనం కలిగించే వార్త బయటకు వచ్చింది. 
 
చెన్నైకి చెందిన బౌలర్‌ దీపక్‌ చాహర్‌, యువ బ్యాట్స్‌మన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌కు కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వీరిని ఐసోలేషన్‌లో ఉంచారు. వీరందరినీ బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ పర్యవేక్షిస్తోంది. ఇప్పటివరకు ట్రైనింగ్‌ను ప్రారంభించకపోవడంతో చెన్నై జట్టు ఇబ్బంది పడుతుంది.

నెగెటివ్‌గా తేలిన వారంతా సాధనలో పాల్గొనాలంటే సెప్టెంబర్‌ 3న నిర్వహించే టెస్టులో మరోసారి కోవిడ్‌-19 ఫలితం నెగెటివ్‌గా రావాల్సి ఉంటుంది. సెప్టెంబర్‌ 12 వరకు చాహర్‌, గైక్వాడ్‌ క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్ దాడులు: ఖండించిన భారత్

పూటుగా లిక్కర్ సేవించి ర్యాపిడో ఎక్కిన యువతి, సీటు నుంచి జారుతూ... వీడియో వైరల్

Survey: సర్వేలో బాలకృష్ణపై హిందూపూర్ ప్రజలు ఏమంటున్నారు?

రేవంత్ రెడ్డి బెస్ట్ సీఎం అవుతాడనుకుంటే అలా అయ్యారు: వీడియోలో కెఎ పాల్

పులివెందులలో జగన్‌కు ఎదురుదెబ్బ.. వేంపల్లి నుండి టీడీపీలో చేరిన వైకాపా సభ్యులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

తర్వాతి కథనం
Show comments