చిత్తుగా ఓడిన చెన్నై... ఐపీఎల్ హిస్టరీలో తొలి ఆటగాడు మహీ! (Video)

Webdunia
మంగళవారం, 20 అక్టోబరు 2020 (09:39 IST)
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సోమవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన కీలక మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది. ఈ ఓటమితో ఆ జట్టు ప్లేఆఫ్ దశకు దూరమైంది. పైగా, ఆ జట్టుకు మిగిలిన నాలుగు మ్యాచ్‌లు నామమాత్రంగా మారాయి. ఇదిలావుంటే, జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నారు. 
 
 


 
ఈ మ్యాచ్‌లో మహీ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. చెన్నై తరపున ఆడుతున్న ధోనీ.. ఐపీఎల్‌ చరిత్రలో 4 వేల పరుగులు మార్క్‌ చేరుకున్నాడు. 2008 సీజన్‌ ఆరంభం నుంచి రెండేండ్లు మినహా ధోనీ చెన్నైకి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒకే టీమ్‌ తరపున 4 వేల పరుగులు సాధించి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 
 
అంతేకాకుండా, ఐపీఎల్‌లో ఇప్పటివరకు 200 మ్యాచ్‌లు ఆడిన ధోనీ 4596కిపైగా పరుగులు పూర్తి చేశాడు. అందులో 23 అర్థశతకాలు ఉన్నాయి. లీగ్‌లో అత్యధిక స్కోరు 84. అలాగే, ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రోహిత్‌ (197), రైనా (193), కార్తీక్‌ (191), కోహ్లీ (186) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Naipunyam Portal: 2029 నాటికి యువతకు 20 లక్షల ఉద్యోగాలను సృష్టించాలి.. నారా లోకేష్

ChandraBabu: నాలుగు గంటలే నిద్రపోయే ఏపీ సీఎం చంద్రబాబు.. ఫాలో అవుతున్న నారా లోకేష్

నవంబర్ 8న నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం

2027 Jagan Padayatra: 2027లో జగన్ కొత్త పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారా?

Lizard: వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బంగారు, వెండి ప్రతిమలు మాయం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

The Girlfriend Review : రష్మిక మందన్నా నటించిన ది గాళ్ ఫ్రెండ్ రివ్యూ

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments