Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2020 : ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ కేకేఆర్... బ్యాటింగుకు దిగిన హైదరాబాద్

Webdunia
ఆదివారం, 18 అక్టోబరు 2020 (16:39 IST)
యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 13వ సీజన్ పోటీల్లో భాగంగా, ఆదివారం రెండు మ్యాచ్‌లు జరుగుతున్నాయి. వీటిలో తొలుత హైదరాబాద్ సన్‌రైజర్స్, కోల్‌కతా నైట్ రైడరోస్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి.
 
అయితే, కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ జట్లు మధ్య అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియం వేదికైంది. ఈ పోరులో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కోల్‌కతా జట్టులో న్యూజిలాండ్ స్పీడ్ స్టర్ లాకీ ఫెర్గుసన్ ఎంట్రీ ఇచ్చాడు. 
 
చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌ను కూడా తుదిజట్టులోకి తీసుకున్నారు. క్రిస్ గ్రీన్, ప్రసిద్ధ్ కృష్ణలకు ఉద్వాసన పలికారు. సన్ రైజర్స్ జట్టులో కూడా మార్పులు చేశారు. ఖలీల్ అహ్మద్ స్థానంలో ఆల్ రౌండర్ బాసిల్ థంపీని జట్టులోకి తీసుకున్నారు. షాబాజ్ నదీమ్ స్థానంలో అబ్దుల్ సమద్ జట్టులోకి వచ్చాడు.
 
అయితే, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేస్తున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. టి నటరాజన్‌ వేసిన ఆరో ఓవర్‌ ఆఖరి బంతికి ఓపెనర్‌ రాహుల్‌ త్రిపాఠి బౌల్డ్‌ అయ్యాడు. పవర్‌ప్లే ఆఖరికి 48/1తో పటిష్టస్థితిలో నిలిచింది.
 
మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. బసిల్‌ థంపీ వేసిన ఐదో ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాది 14 రాబట్టి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆరంభంలో సన్‌రైజర్స్‌ బౌలర్లను ఓపెనింగ్‌ జోడీ ధాటిగాఎదుర్కొంది. 12 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

తర్వాతి కథనం
Show comments