Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్2020 : కొదమ సింహాల పోరు .. బెంగుళూరు వర్సెస్ హైదరాబాద్

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (09:02 IST)
ఐపీఎల్2020 టోర్నీలోభాగంగా, సోమవారం రాత్రి మూడో మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో రెండు కొదమ సింహాల్లాంటి రెండు జట్లు తలపడనున్నాయి. ఒకటి సన్ రైజర్స్ హైదరాబాద్ కాగా, మరొకటి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్‌లో సమతూకంలో ఉన్న ఇరు జట్ల మధ్య జరుగనున్న ఈ పోటీ రసవత్తరంగా సాగుతుందని భావిస్తున్నారు. 
 
ముఖ్యంగా, ఈ ఇరు జట్లలో ఒక జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉంటే, మరో జట్టుకు వార్నర్ సారథిగా ఉన్నాు. నిజానికి ఐపీఎల్‌ అనగానే వార్నర్‌ ఎలా రెచ్చిపోతాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2016లో తన నాయకత్వంలో హైదరాబాద్‌కు టైటిల్‌ సాధించి పెట్టిన వార్నర్‌కు మరోసారి బెయిర్‌స్టో తోడయ్యాడంటే ప్రత్యర్థికి ముచ్చెమటలే. 
 
వీరు గత సీజన్‌లో ఆర్‌సీబీతో మ్యాచ్‌లోనే టోర్నీ చరిత్రలో మొదటి వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. డేవిడ్‌-స్టో మళ్లీ మెరుపులు మెరిపించడంతోపాటు విలియమ్సన్‌, మనీశ్‌ పాండే, మిచెల్‌ మార్ష్‌ కూడా సత్తా చాటితే హైదరాబాద్‌ భారీ స్కోరు చేయడం ఖాయం. భువనేశ్వర్‌ ఆధ్వర్యంలో పేస్‌, రషీద్‌ ఖాన్‌ నేతృత్వంలో స్పిన్‌ విభాగాలు ప్రత్యర్థులకు సవాల్‌ విసరనున్నాయి.
 
అలాగే, కోహ్లీ, డివిల్లీర్స్‌వంటి మేటి ఆటగాళ్లతో పటిష్టంగా ఉన్న రాయల్స్‌ బ్యాటింగ్‌ టీ20ల స్పెషలిస్ట్‌ అరోన్‌ ఫించ్‌ చేరికతో మరింత బలపడింది. ఇక.. యువ ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌ కూడా అంచనాలను అందుకొంటే బెంగళూరుకు తిరుగుండబోదు. స్టెయిన్‌, ఉమేశ్‌ యాదవ్‌, సైనీలతో పేస్‌, చాహల్‌, జంపాతో స్పిన్‌ విభాగాలు ప్రత్యర్థుల పనిపట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. 
 
తుది జట్టు బెంగుళూరు (అంచనా)
కోహ్లీ (కెప్టెన్‌), ఫించ్‌, పడిక్కల్‌, డివిల్లీర్స్‌ (కీపర్‌), శివమ్‌ దూబే, మొయిన్‌, సుందర్‌, మోరిస్‌, నవ్‌దీప్‌, చాహల్‌, ఉమేశ్‌.
 
తుది జట్టు హైదరాబాద్ (అంచనా)
వార్నర్‌ (కెప్టెన్‌), బెయిర్‌ స్టో, మనీశ్‌, విరాట్‌ సింగ్‌, విజయ్‌ శంకర్‌, నబి, రషీద్‌, అభిషేక్‌ శర్మ, భువనేశ్వర్‌, సందీప్‌ శర్మ, ఖలీల్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

తర్వాతి కథనం
Show comments