మళ్లీ విమర్శిస్తే చంపేస్తా.. ఆర్‌సీబీ అభిమాని హెచ్చరిక..

Webdunia
శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (17:52 IST)
ఐపీఎల్-12లో రాయల్ ఛాలెంజర్స్‌ పేలవ ప్రదర్శనతో అభిమానులు ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. జట్టు వరుస పరాజయాలతో ఆర్‌సీబీ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మొదలుపెట్టారు. మరికొందరు అయితే ఏకంగా కెప్టెన్‌ను మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆర్సీబీ ఆటతీరుపై న్యూజిలాండ్‌ బౌలర్‌, ప్రముఖ కామెంటేటర్‌ సైమన్‌ డౌల్‌ విమర్శలు చేసాడు. 
 
తాజాగా ఓ డై హార్డ్ ఆర్సీబీ ఫ్యాన్ ఆ కమెంట్‌లను తట్టుకోలేక ఆర్సీబీని విమర్శిస్తే చంపుతానని హెచ్చరిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసాడు. "ఇతరుల గురించి మాట్లాడే ముందు ఆలోచించాలి. రాయల్ ఛాలెంజర్స్ వారి పరాజయాన్ని అంగీకరించారు. మళ్లీ ఎప్పుడూ అలాంటి కామెంట్స్ చేయకని, కాదని మళ్ళీ విమర్శించావో చచ్చిపోతావు జాగ్రత్త" అంటూ హెచ్చరించాడు.
 
ఆ అభిమాని పోస్ట్‌పై సైమన్‌ డౌల్‌ స్పందించాడు. ‘ఇది ఒక ఆట మాత్రమే. చిల్‌ ఔట్‌ బ్రో’ అంటూ ట్విటర్‌లో సమాధానం ఇచ్చాడు. ఇలా చాలా మంది నుంచి విమర్శలు రావడంతో సైమన్‌ డౌల్‌కు ఆర్సీబీపై చేసిన విమర్శల పోస్టును తొలిగించారు. ప్రస్తుతం బెంగళూరు ఆడిన నాలుగు మ్యాచ్‌లు ఓటమి చెందడంతో ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూటర్ నేర్పిస్తానని నమ్మించి ఫామ్‌హౌస్‌లో అత్యాచారం.. బయటకు చెపితే ఫ్యామిలీ మొత్తాన్ని జైల్లో పెట్టిస్తానంటూ...

కర్నాటక, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో వీధి కుక్కల స్త్వైర విహారం, వీడియో

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు కోర్టు ఉపశమనం.. ఆన్‌లైన్‌లో వ్యాప్తికి అడ్డుకట్ట

హన్మకొండ బాలుడు నిరంజన్ వద్దకు గంటలో కుక్కపిల్ల పంపిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్, వీడియో

పానీపూరీ తిన్న 15మంది పిల్లలకు అస్వస్థత.. ఏమైంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinu Vaitla: శర్వా నంద్, డైరెక్టర్ శ్రీనువైట్ల సినిమాకు సన్నాహాలు

మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న విష్ణు మంచు కన్నప్ప

Sree Vishnu: ఒరియా పిల్లా.. అంటూ టీజ్ చేస్తున్న కామ్రేడ్ కళ్యాణ్

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం

Vadde Naveen: ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాల్ని చూసే తీరు మారింది : వడ్డే నవీన్

తర్వాతి కథనం
Show comments