అంపైర్ బంతి మరిచిపోతే.. ఎలా వుంటుంది.. (Video)

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (12:38 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా బెంగళూరు చిన్నస్వామి వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌‌లో బెంగళూరు విజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. 
 
203 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ ఛేదించలేకపోయింది. చివరి మూడు ఓవర్లు ఎంత ప్రయత్నించినా బౌన్దరీలు కష్టమవడంతో పంజాబ్ చేతులెత్తేసింది. చివరికి 17 పరుగుల తేడాతో కోహ్లీ సేన గెలుపును నమోదు చేసుకుంది.
 
ఇక  బెంగళూరు, పంజాబ్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌‌లో బాల్ కనబడకుండా పోయింది. డివిలియర్స్ కొట్టిన సిక్సుతో బాల్ పోయిందనుకున్నారు చాలామంది. కానీ అంపైర్ మర్చిపోయిన బాల్ గురించే ఇప్పుడు చర్చ. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో స్ట్రాటజిక్ టైం సమయంలో అంపైర్ ఒకరు బంతిని జేబులో వేసుకున్నారు. అయితే స్ట్రాటజిక్ టైం అయ్యాక రాజ్‌పుత్ బౌలింగ్ వేద్దాం అనుకుంటే బంతి లేదు. 
 
అంపైర్లను అడిగినా బంతి లేదన్నారు. అసలు బంతి ఎక్కడికి పోయిందో అర్థం కాలేదు. బంతి దొరకలేదని బయట నుంచి కొత్త బంతిని తెప్పించేలోపు అది ఒక అంపైర్ ప్యాంటు జేబులో ఉందని తెలుసుకొని ఇచ్చేశాడు. ఆ ఘటన చూసి ఆటగాళ్లే కాక ప్రేక్షకులు కూడా నవ్వుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్ నా చిరకాల మిత్రుడు, నేను ఆయనను ఏమీ అనలేదు, అనను: విజయసాయి రెడ్డి

ఆంధ్ర, తెలంగాణల్లో హాట్ టాపిక్ అదే.. కేటీఆర్-జగన్, రేవంత్-చంద్రబాబుల భేటీ

అమరావతిలో 25 బ్యాంకులకు ఒకే రోజు శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన... సమస్యలను ఏకరవు పెట్టిన స్థానికులు

కొత్త సీజేఐగా సూర్యకాంత్ ప్రమాణం... అధికారిక కారును వదిలి వెళ్లిన జస్టిస్ గవాయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించినవేనా?

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్లన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

Dharma Mahesh: హీరో ధర్మ మహేష్ ప్రారంభించిన జిస్మత్ జైల్ మందీ

తర్వాతి కథనం
Show comments