Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడాకుల కోసం కోర్టుకెక్కిన దర్శకుడు శ్రీనువైట్ల భార్య?

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (16:05 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన మరో జంట విడిపోనుంది. తన భర్త నుంచి విడాకులు మంజూరు చేయాలని టాలీవుడ్ దర్శకుడు శ్రీను వైట్ల సతీమణి రూప కోర్టు మెట్లెక్కారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన అనేక చిత్రాల్లో కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన రూప ఫ్యాషన్ రంగంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తెలుగు చిత్రపరిశ్రమలో మంచి గుర్తింపుకలిగిన ఫ్యాషన్ డిజైనర్‌గా మారిపోయారు. ఆమెను శ్రీనువైట్ల వివాహం చేసుకున్నారు. ఇపుడు వీరిద్దరూ విడిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. 
 
తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు కూడా శ్రీను వైట్ల కూడా సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అందుకే రూప తన భర్త నుంచి విడాకులు కోరుతూ హైదరాబాద్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం. గతంలో ఒకసారి ఇదేవిధంగా ఆమె కోర్టుకెక్కింది. 
 
కానీ, ఆమె తల్లిదండ్రులు వారించడంతో సర్దుకుపోయింది. కానీ, ఈ దఫా మాత్రం రూప తాను నిర్ణయంపై గట్టిగా నిలబడి విడాకుల కోసం పోరాటం చేస్తున్నారు. అయితే, ఈ విషయంపై శ్రీను వైట్ల స్పందించాల్సివుంది. కాగా, వీరిద్దరూ గత నాలుగేళ్లుగా వేర్వేరుగా జీవిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments