Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాంసాహారాన్ని తొలిసారి టేస్ట్ చేసిన మహిళ.. 22 ఏళ్లుగా శాకాహారి.. నూనెలో వేయించిన ముక్కల్ని?

స్థూలకాయం మాంసాహారం అధికంగా తీసుకోవడం ద్వారా వస్తుందని వైద్యులు అంటూ వుంటారు. మాంసాహారాన్ని అధికంగా తీసుకోకూడదని.. అలా తీసుకుంటే అనారోగ్యం పాలవుతారని వారు సూచిస్తుంటారు. ఈ నేపథ్యంలో 22 సంవత్సరాలుగా శా

Webdunia
సోమవారం, 7 నవంబరు 2016 (09:50 IST)
స్థూలకాయం మాంసాహారం అధికంగా తీసుకోవడం ద్వారా వస్తుందని వైద్యులు అంటూ వుంటారు. మాంసాహారాన్ని అధికంగా తీసుకోకూడదని.. అలా తీసుకుంటే అనారోగ్యం పాలవుతారని వారు సూచిస్తుంటారు. ఈ నేపథ్యంలో 22 సంవత్సరాలుగా శాకాహారం తీసుకున్న మహిళ తొలిసారిగా మాంసాన్ని రుచిచూసింది. ఈ ఉదంతం అమెరికాలోని చికాగోలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. చికాగో నగరానికి చెందిన స్టెఫానీ పోటకీస్ అనే మహిళ 22 ఏళ్లుగా శాకాహారిగానే ఉంది. శాకాహారం తిని తిని మొహం మొత్తిన సదరు మహిళ ఓ రోజు మాంసం తినాలని నిర్ణయించుకుంది. ఈ విషయం తెలుసుకున్న సూపర్ క్లబ్ బృందం స్టెఫానీ ఫోటకీస్‌ను చికాగోలోని అత్యంత ప్రజాదరణ పొందిన స్టేక్ హౌస్ రెస్టారెంట్‌కు తీసుకువెళ్లి అక్కడి ఆమెకు వివిధ రకాల మాంసాహార పదార్థాలను వండి పెట్టారు.
 
ఆయిల్‌లో వేయించిన మాంసపు ముక్కలను ఫోర్క్ సాయంతో తింటూ లొట్టలేసిన స్టెఫానీ మాంసాహారం గురించి గొప్పలు చెప్పుకొచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్ అయ్యింది.

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments