Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్తాన్ పోలీసులను పరుగెత్తించి కర్రలతో బాదుతున్న సింధ్ ప్రజలు, ఎందుకని?

ఐవీఆర్
గురువారం, 22 మే 2025 (19:18 IST)
పాకిస్తాన్ దేశంలోని సింధ్ ప్రాంత ప్రజలు పాకిస్తాన్ పోలీసులను పరుగులుపెట్టించి కర్రలు, బండలతో కొడుతూ వెంటబడుతున్నారు. ప్రజలు దాడి చేస్తుండటంతో పోలీసులు పారిపోతున్నారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సింధ్ హోంమంత్రి జియావుల్ హసన్ లంజార్ ఇంటిని నిరసనకారులు తగలబెట్టారు. సింధు నది నుండి నీటిని మళ్లించే ప్రాజెక్టుకి వ్యతిరేకంగా జరిగిన నిరసన సందర్భంగా హింస చెలరేగింది.
 
నౌషెహ్రో ఫిరోజ్‌లో పోలీసులు, జాతీయవాద సంస్థ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో ఇద్దరు మృతి చెందారు, అనేక మంది గాయపడ్డారు. కాలువ నిర్మాణంపై స్థానిక ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తమ భూమిని, నీటిని సైనికాధికారులు లాక్కుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. నిరసనకారులు హైవేపై ధర్నా చేశారు, పోలీసులు వారిని అడ్డుకున్నారు, ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.
 
నిరసనకారులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో వారు మరింత ఆగ్రహం చెందారు. ఏకంగా మంత్రి లంజార్ ఇంటికి నిప్పు పెట్టేసారు. ఇంటికి కాపలాగా వున్న సెక్యూరిటీ గార్డులను కర్రలతో బాదారు. అడ్డు వచ్చినవారిని వచ్చినట్లు దేహశుద్ధి చేసారు. పోలీసు ట్రక్కుల్లో వున్న ఆయుధాలను దోచుకున్నారు. తుపాకులను చేతబూని పోలీసులపై గురిపెట్టారు. దీనితో భయభ్రాంతులకు గురైన పోలీసులు అక్కడి నుంచి పరుగులు తీస్తూ పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments