Webdunia - Bharat's app for daily news and videos

Install App

జవహరీ అంతంపై స్పందించిన అమెరికా మాజీ అధ్యక్షుడు

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2022 (12:45 IST)
అల్‌ఖైదా అధినేత అల్‌ జవహరీని అమెరికా సైన్యం (సీఐఏ) హతమార్చడంపై ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా స్పందించారు. ఒక్క ప్రాణ నష్టం కూడా జరుగకుండా జవహరీని అంతం చేయడాన్ని అభినందిస్తున్నట్టు చెప్పారు. 
 
9/11 సూత్రధారికి ఎట్టకేలకు దాదాపు 20 ఏళ్ల తర్వాత శిక్ష పడిందని అన్నారు. అఫ్గానిస్థాన్‌లో యుద్ధం లేకుండానే ఉగ్రవాదాన్ని అంతమొందించడం సాధ్యమే అనడానికి ఈ ఆపరేషన్‌ నిదర్శనమన్నారు. ఈ ఆపరేషన్ కోసం దశాబ్దాలుగా పనిచేసిన సీఐఏ అధికారులను కొనియాడారు. 
 
ఇదే అంశంపై ఒబామా ఓ ప్రకటన విడుదల చేశారు. 'అమెరికాలో 9/11 ఉగ్రదాడి జరిగిన 20 ఏళ్ల తర్వాత దాడికి ప్రధాన సూత్రధారుల్లో ఒకడు అల్‌ జవహరీకి ఎట్టకేలకు శిక్ష పడింది. ఈ క్షణం కోసం అమెరికా నిఘా సంస్థ సభ్యులు దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. ఒక్క ప్రాణ నష్టం లేకుండా జవహరీని కౌంటర్‌ టెరరిజం నిపుణులు మట్టుబెట్టగలిగారు. 
 
ఈ సందర్భంగా బైడెన్‌ నాయకత్వానికి, ఆపరేషన్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు. అఫ్గానిస్థాన్‌లో ఎలాంటి యుద్ధం చేయకుండానే.. ఉగ్రవాదాన్ని నిర్మూలించడం సాధ్యమే అని చెప్పేందుకు ఈ ఆపరేషనే నిదర్శనం. అల్‌ఖైదా కారణంగా ఎన్నో బాధలు అనుభవిస్తున్నవారికి, 9/11 మృతుల కుటుంబాలకు ఈ వార్త ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నా' అని ఒబామా పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments