Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైటెక్ సిటీ సమీపంలో రైలు ప్రమాదం.. - ముగ్గురు స్పాట్ డెడ్

mmts train
, మంగళవారం, 26 జులై 2022 (18:47 IST)
హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీ సమీపంలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ట్రాక్‌పైకి వచ్చిన ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైటెక్ సిటీ సమీపంలోని మూల మలుపు వద్ద ఎంఎంటీఎస్ రైలును గమనించకుండా ముగ్గురు వ్యక్తులు పట్టాలు దాటేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వేగంగా దూసుకొచ్చిన రైలు వారిపై దూసుకెళ్లింది. 
 
దీంతో ఆ ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను రాజప్ప, శ్రీను, కృష్ణలుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళనాడులో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య