Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాన్‌తో జనాలపైకి ఎక్కించిన ఐసిస్... రక్తమోడిన రహదారులు...

స్పెయిన్‌ దేశంలోని ప్రధాన పట్టణమైన బార్సిలోనాపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఫలితంగా స్పెయిన్ రహదారులు రక్తమోడాయి. బార్సిలోనాలో అత్యంత రద్దీగా ఉండే లస్‌ రంబ్లస్‌ రహదారిలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు(ఐఎ

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2017 (07:03 IST)
స్పెయిన్‌ దేశంలోని ప్రధాన పట్టణమైన బార్సిలోనాపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఫలితంగా స్పెయిన్ రహదారులు రక్తమోడాయి. బార్సిలోనాలో అత్యంత రద్దీగా ఉండే లస్‌ రంబ్లస్‌ రహదారిలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు(ఐఎస్ఐఎస్‌) వ్యాన్‌తో పాదాచారులను ఢీకొట్టారు. దీంతో అప్పటివరకు ఆహ్లాదకరంగా ఉన్న ఆ రహదారి ఆర్తనాదాలు, ఉరుకులు పరుగులు, ప్రాణభయంతో పరుగులు తీశారు.
 
కాగా, ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా, 50 మందికిపైగా గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడ్డ వ్యక్తి పోలీసులు కాల్చి చంపారు. ఈ దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు పాల్గొనే ప్రణాళిక రచించారని, ఒక వ్యక్తి దాడికి పాల్పడగా, రెండో వ్యక్తిని కాటలోనియాలోని విక్ పట్టణంలో పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ దాడి తమ ఉగ్రవాదులే చేశారని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.  
 
నిజానికి ఉగ్రవాదులు ఇపుడు పంథా మార్చారు. నిన్నమొన్నటివరకు బాంబులు, తుపాకులతో దాడులు చేసే ఉగ్రమూకలు.. ఇపుడు వ్యూహం మార్చారు. భారీ వాహనాలనే మారణాయుధాలుగా ఎంచుకుంటున్నారు. రద్దీగా ఉండే రోడ్లపై వాహనాలతో స్వైరవిహారం చేస్తూ పదుల సంఖ్యలో ప్రాణాలు బలిగొంటున్నారు. అలాంటిదే ఇపుడు జరిగిన ఉగ్రదాడి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments