Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీలైనంత త్వరగా భారతదేశాన్ని విడిచిపెట్టి వచ్చేయండి: పౌరులకు అమెరికా హెచ్చరిక

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (13:38 IST)
భారతదేశంలో పెరుగుతున్న కోవిడ్ -19 సంక్షోభం కారణంగా వీలైనంత త్వరగా భారతదేశాన్ని విడిచిపెట్టమని యుఎస్ ప్రభుత్వం తన పౌరులకు తెలిపింది. లెవల్ 4 ట్రావెల్ అడ్వైజరీలో ఈ మేరకు అమెరికా ప్రకటన చేసింది. "భారతదేశానికి వెళ్లవద్దు, అలాగే అక్కడ వున్నవారు సాధ్యమైనంత త్వరగా వచ్చేయండి" అని పేర్కొంది.
 
భారతదేశం, యు.ఎస్, యూరప్ ద్వారా అనుసంధానించే ఇతర సేవల మధ్య 14 ప్రత్యక్ష రోజువారీ విమానాలు ఉన్నాయని డిపార్టుమెంట్ తెలిపింది. రికార్డు స్థాయిలో కోవిడ్ -19 కేసులు, మరణాలు దేశంలో సంభవిస్తున్నాయి. భారతదేశంలో గురువారం భారీగా 379,257 కేసులు, 3,645 మంది మరణించినట్లు నివేదించింది, తద్వారా ఇది ఇప్పటివరకు అతిపెద్ద సింగిల్-డే స్పైక్ అని ఎమ్‌హెచ్‌ఎఫ్‌డబ్ల్యూ తెలిపింది. దీనితో కరోనా కారణంగా ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 204,812 కు చేరుకుంది. భారతదేశంలో ఇప్పుడు దాదాపు 3.1 మిలియన్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. భారతదేశం ఇప్పుడు వారానికి సగటున 3,00,000 కేసులను నివేదిస్తోంది. 
 
కాగా ఆస్ట్రేలియా ఈ వారం ప్రారంభంలో భారతదేశం నుండి అన్ని విమానాలను నిషేధించింది. గత 10 రోజులలో భారతదేశంలో ఉన్న ఏ సందర్శకుడైనా ప్రవేశించకుండా ఇంగ్లాండ్ నిషేధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments