Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా బుద్ధి మారదా? సముద్రంపై పట్టుకు డ్రాగన్ కంట్రీ ప్రయత్నం

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (15:26 IST)
South China Sea
కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ దేశాలు విలవిల్లాడుతుంటే చైనా మాత్రం దక్షిణ చైనా సముద్రంపై పట్టుసాధించాలని ప్రయత్నాలు చేస్తోంది. కరోనా వైరస్ పుట్టుకకు కేంద్రమైన చైనా.. దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతంలో తన ప్రాదేశిక ఆశయాల కోసం ప్రయత్నిస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఆరోపించారు. దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం, తైవాన్‌, ఫిలిప్పీన్స్‌ మలేషియా, బ్రూనైతో ఉద్రిక్తతలకు కారణమైన ప్రాంతంలో డ్రాగన్‌ దేశం పట్టు పెంచుకుంటోందని పాంపియో చెప్పారు. 
 
వివాదంలో ఉన్న ప్రాంతంలో మిలటరీ బలగాలు, యుద్ధ నౌకలను మోహరించి చైనా పొరుగు దేశాలను భయపెట్టే యత్నం చేస్తోందని విమర్శించారు. తద్వారా చమురు, సహజయవాయువు ప్రాజెక్టుల అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తోందన్నారు. పాంపియో ఆరోపణల నేపథ్యంలో యూఎస్‌ యుద్ధనౌక దక్షిణ చైనా సముద్రంలోని తైవాన్‌ జలసంధి గుండా నిఘా పెట్టింది. మరోవైపు దక్షిణ చైనా సముద్రం మొత్తాన్ని, ఆ చుట్టుపక్కల ఉన్న దీవులు, దిబ్బల లెక్క తీస్తున్నామని చైనా తమ చర్యను సమర్థించుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏమీ ఇవ్వలేనన్నారు, ఐతే ఈసారికి ఫ్రీ అన్నాను: నటి ప్రియాంకా జవల్కర్

Pawan: వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు

Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్

ప్రదీప్ మాచిరాజు చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూ

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments