Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాలి జనార్థన్ రెడ్డి 'కుడి భుజం'కు డోనాల్డ్ ట్రంప్ ఆహ్వానం

గాలి జనార్థన్ రెడ్డి. ఈ పేరు దేశంలో తెలియనివారుండరు. ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు బాగా పరిచయం. ఎందుకంటే.. ఐరన్ ఓర్ మైనింగ్ కింగ్‌గా చెలామణి అయిన గాలి జనార్థన్ రెడ్డి గత యూపీఏ ప్రభు

Webdunia
శనివారం, 3 ఫిబ్రవరి 2018 (09:44 IST)
గాలి జనార్థన్ రెడ్డి. ఈ పేరు దేశంలో తెలియనివారుండరు. ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు బాగా పరిచయం. ఎందుకంటే.. ఐరన్ ఓర్ మైనింగ్ కింగ్‌గా చెలామణి అయిన గాలి జనార్థన్ రెడ్డి గత యూపీఏ ప్రభుత్వంలో అష్టకష్టాలు పడ్డారు. మైనింగ్ అక్రమ రవాణా కేసులో ఏకంగా రెండేళ్ళకు పైగా జైలుశిక్షను అనుభవించి, ప్రస్తుతం బెయిలుపై విడుదలై ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుడి భుజంగా చెలామణి అయిన బళ్ళారి లోక్‌సభ సభ్యుడు శ్రీరాములుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నుంచి ఆహ్వానం అందింది. 
 
సాధారణంగా అమెరికా అధ్యక్షుడిగా ఎవరైనా గెలిచాక 130 దేశాల నుంచి ప్రముఖులను ఆహ్వానించి ఆ దేశ సంప్రదాయాల ప్రకారం విందు ఇవ్వడం ఎప్పటి నుంచో ఆనవాయతీగా వస్తోంది. ఇప్పుడు ట్రంప్ కూడా విందు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో విందును ఏర్పాటు చేశారు. 
 
ఈ విందుకు భారత్ నుంచి ఇద్దరు నేతలను ఎంపిక చేశారు. వీరిలో ఒకరు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ కాగా, మరొకరు శ్రీరాములు. వీరిద్దరికీ ఇప్పటికే వైట్ హౌస్ నుంచి ఆహ్వానాలు అందాయి. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ, సంతోషాన్ని వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు తనను ఆహ్వానించడం మరిచిపోలేని అనుభూతిగా ఆయన పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments