Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంకుల్లోని రూ.70 వేల కోట్లు సీజ్ : బైడెన్ సంచలన నిర్ణయం

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (14:50 IST)
ఆప్ఘనిస్థాన్ దేశం తాలిబన్ తీవ్రవాదుల వశమైంది. దీంతో ఆ దేశంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, ఆప్ఘనిస్థాన్‌లో మళ్లీ తాలిబన్ల రాజ్యం ఏర్పడటానికి అమెరికా తీసుకున్న నిర్ణయాలే కారణమని ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
ఈ విషయంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం బైడెన్‌‌ను టార్గెట్ చేసున్నారు. అంతేకాకుండా ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక తప్పిదంగా అనేక మంది అభిప్రాయపడుతున్నారు. అమెరికా చరిత్రలోనే ఇది ఘోరమైన వైఫల్యమని దుయ్యబట్టారు.
 
తనపై విమర్శలకు స్పందించిన జో బైడెన్.. అవసరమైతే అఫ్గన్‌‌లో ఉగ్రవాదంపై పోరాటం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాలిబన్ల‌కు అమెరికా గట్టి షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 
 
అమెరికా బ్యాంకుల్లోని ఉన్న ఆప్ఘన్ నిధులపై ఆంక్షలు విధించింది. దాదాపు 9.5 బిలియన్‌ డాలర్ల విలువైన ఆస్తులను (రూ.70వేల కోట్లు) సీజ్‌ చేసినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఆప్ఘన్ సెంట్రల్ బ్యాంకుకు సంబంధించిన ఈ నిధులు తాలిబన్ల చేతుల్లోకి వెళ్లకుండా నిధులు సీజ్ చేసినట్టు అధికార యంత్రాంగం ధ్రువీకరించింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments