Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికన్లకు స్వర్ణయుగం రాబోతుంది : డోనాల్డ్ ట్రంప్ విజయోత్సవ స్పీచ్

ఠాగూర్
బుధవారం, 6 నవంబరు 2024 (14:42 IST)
అమెరికన్లకు స్వర్ణ యుగం రాబోతుందని ఆ దేశానికి కాబోయే కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. బుధవారం వెలువడుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ వీడింది. అమెరికా పౌరులు ఎలాంటి గందరగోళం లేకుండా స్పష్టమైన తీర్పునిచ్చారు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు కలిగిన అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలంటే 270 ఓట్లు ఖచ్చితంగా సాధించాల్సివుంది. ఇపుడు రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేసిన డోనాల్డ్ ట్రంప్ 277 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన గెలుపు లాంఛన ప్రాయంగా మారనుంది. దీంతో ఆయన అమెరికాకు 47వ అధ్యక్షుడుగా త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. 
 
ఈ విజయాన్ని పురస్కరించుకుని ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమెరికన్లకు స్వర్ణయుగం రాబోతుందన్నారు. ఎన్నికల యుద్ధంలో రిపబ్లికన్లు ఎంతగానో శ్రమించారన్నారు. రిపబ్లికన్ పార్టీకి 300పైగా సీట్లు వచ్చే అవకాశం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే, ఎన్నికల్లో ఘన విజయం అందించిన అమెరికా పౌరులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments