Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా క్యాపిటల్ భవనం వద్ద కారు బీభత్సం... మూసివేత

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (08:26 IST)
అమెరికాకు గుండెకాయలాంటి క్యాపిటల్ భవనాన్ని మూసివేశారు. ఈ భవనం వద్ద శుక్రవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒక పోలీస్ అధికారి మరణించగా, కారు డ్రైవర్‌ను భద్రత సిబ్బంది కాల్చి చంపారు. ఈ ఘటన తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా అమెరికా క్యాపిటల్ భవనాన్ని అధికారులు మూసివేశారు. భవనం ప్రాంగణాన్ని దిగ్బంధించారు. 
 
కాగా, శుక్రవారం మధ్యాహ్నం అధ్యక్ష భవనానికి సమీపంలో ఓ చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా ఉన్నట్లుండి ఓ కారు ఇద్దరు పోలీసులపైకి దూసుకువెళ్లింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అనుమానితుడిపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన ఓ పోలీసుతో పాటు అతడిని కూడా ఆసుపత్రికి తరలించారు. 
 
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పోలీసు అధికారి విలియమ్ ఎవన్స్‌తో పాటు కాల్పుల్లో గాయపడిన నిందితుడు కూడా మృతిచెందాడు. ఈ ఘటన నేపథ్యంలో క్యాపిటల్ భవనాన్ని మూసివేసిన అధికారులు.. భవన సముదాయం వద్ద భారీగా నేషనల్‌ గార్డ్స్‌ను మోహరించారు. 
 
పోలీస్ అధికారి ఎవన్స్‌ మృతి పట్ల అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అధికారికి సంతాపంగా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో ఏప్రిల్​ 6 వరకు జాతీయ జెండాను అవనతం చేయాలని ఆదేశించారు. అటు పోలీసు అధికారి మృతి పట్ల అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ విచారం వ్యక్తం చేశారు. ఎవన్స్​ మృతి పట్ల కమల సంతాపం తెలిపారు. 

కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయన్న అక్కసుతో అప్పటి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన అనుచరులను రెచ్చగొట్టి ఇదే క్యాపిటల్ భవనంపై దాడికి ఉసిగొల్పిన విషయం తెల్సిందే. ఈ దాడితో ప్రపంచం ఒక్కసారి ఉలిక్కిగురైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments