Webdunia - Bharat's app for daily news and videos

Install App

జన్యుమార్పిడితో సిద్ధం చేసిన పంది గుండెను మనిషికి అమర్చిన వైద్యులు... ఎక్కడ?

Webdunia
ఆదివారం, 24 సెప్టెంబరు 2023 (10:57 IST)
జన్యుమార్పిడి ద్వారా సిద్దం చేసిన పందిగుండెను వైద్యులు మనిషికి అమర్చారు. ప్రస్తుతం ఆ రోగి వేగంగా కోలుకుంటున్నారు. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ వైద్యుల ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. రోగి వేగంగా కోలుకుంటుండంతో వైద్యులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అయితే, ఆ రోగికి రాబోయే మరికొన్ని వారాలు అత్యంత కీలకమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. 
 
గత యేడాది ప్రపంచంలోనే తొలిసారిగా ఈ ఆపరేషన్ నిర్వహించిన విషయం తెల్సిందే. మృత్యువు అంచులకు చేరుకున్న 58 యేళ్ళ వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు ఈ ప్రయత్నం చేశారు. అయితే, ఆపరేషన్ తర్వాత రోగి వేగంగా కోలుకోవడం వైద్యులను ఆశ్చర్యపరుస్తుంది. ఆపరేషన్ జరిగిన రెండో రోజునే రోగి ఉత్సాహంతో ఉరకలేస్తూ జోకులు వేయడం ప్రారంభించారని వైద్యులు తెలిపారు.
 
అనారోగ్య కారణాలు, గుండె విఫలం కారణంగా రోగితో పంది గుండెను అమర్చాలని వచ్చిందని వైద్యులు తెలిపారు. అయితే, రానున్న కొన్ని వారాలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. గత యేడాది ఈ యూనివర్శిటీ వైద్యులు ప్రపంచంలోనే తొలిసారిగా ఓ పంది గుండెను డెవిడ్ బెన్నెట్ అనే రోగికి అమర్చి రికార్డు సృష్టించిన విషయం తెల్సిందే. అయితే, ఈ ఆపరేషన్ జరిగిన కొన్ని రోజులకే ఆ రోగి ప్రాణాలు కోల్పోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments