Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ పాక్ సైనిక సంఘర్షణ ప్రపంచం భరించలేదు : ఐక్యరాజ్య సమితి

ఠాగూర్
బుధవారం, 7 మే 2025 (11:54 IST)
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగే సైనిక సంఘర్షణను ప్రపంచం భరించలేదని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియా గుటెర్రస్ అభిప్రాయపడ్డారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై భారత్ సైనిక చర్యకు దిగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఈ రెండు దేశాల మధ్య జరిగే సైనిక ఘర్షణను ప్రపంచం భరించలేదని, ఇరుపక్షాలు అత్యంత సంయమనం పాటించాలని ఆయన పిలుపునిచ్చినట్లు ఆయన ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ తెలిపారు. నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారత్ చేపట్టిన సైనిక చర్యల పట్ల సెక్రటరీ జనరల్ తీవ్ర ఆందోళన చెందుతున్నారని డుజారిక్ మంగళవారం వెల్లడించారు. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ క్షిపణి దాడులు చేసినట్లు ప్రకటించిన కొద్దిసేపటికే ఈ ప్రకటన వెలువడింది.
 
మరోవైపు, భారత రక్షణ మంత్రిత్వ శాఖ 'ఆపరేషన్ సిందూర్' ప్రారంభించి, పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద మౌలిక సదుపాయాల స్థావరాలపై దాడులు చేసినట్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపింది. "క్రూరమైన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ఈ ఖచ్చితమైన, నియంత్రిత దాడులు జరిగాయి" అని పేర్కొంది. అంతకుముందు, భారత సైన్యం కూడా పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని 9 ప్రాంతాలపై దాడులు చేసినట్లు ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. "న్యాయం జరిగింది. జై హింద్" అని భారత సైన్యం అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments