Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్ నుంచి భారీ సంఖ్యలో భారతీయ విద్యార్థులు రాక

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (13:57 IST)
ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య సాగుతున్న యుద్ధంలో చిక్కుకున్న భారత పౌరులను, విద్యార్థులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగ పేరుతో ప్రత్యేక విమానాలను నడుపుతోంది. తొలుత ఎయిర్ ఇండియా విమానాలను రంగంలోకి దిగిన భారత్... ఏకంగా వైమానికి దళానికి చెందిన సి-17 విమానాలను ఉపయోగిస్తుంది. 
 
ఈ నేపథ్యంలో గురువారం ఉక్రెయిన్ నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నారు. ఏకంగా 19 విమానాల్లో 3,726 మంది విద్యార్థులు స్వదేశానికి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అనేక వందల మంది విద్యార్థులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. మరికొంతమంది సాయంత్రం లోపు మాతృభూమికి చేరుకోనున్నారు. 
 
ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులను రోడ్డు మార్గంలో సరిహద్దులు తరలించి, అక్కడ నుంచి ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన పోలాండ్, రోమేనియా, బొలీవియా వంటి దేశాల నుంచి తరలిస్తున్నారు. 
 
ఇందులోభాగంగా, 8 విమానాలు బుకారెస్ట్ నుంచి మరో రెండు విమానాలు సుసేవ నుంచి కోసీ నుంచి ఒకటి, బుడాపెస్ట్ నుంచి ఐదు, రెస్టోవ్ నుంచి మూడు విమానాలు బయలుదేరుతాయని కేంద్ర పౌర విమానయాన శాఖాకమంత్రి జ్యోతిరాదిత్య సింథియా వెల్లడించారు. ప్రధాని ఆదేశాలతో ఒక్క రోజులోనే 3726 మందిని స్వదేశానికి తరలించేలా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments