Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్ వెళ్ళాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్...

Webdunia
శుక్రవారం, 14 జులై 2023 (10:40 IST)
భారతీయ సంతతికి చెందిన బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్ భారతీయ యువతకు బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఇకపై యూకే వెళ్ళాలని భావించే వారి నుంచి వీసా ఖర్చులు భారీగా వసూలు చేయనున్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించడం గమనార్హం.
 
వైద్య ఖర్చుల కోసం వీసాదారులు చెల్లించే హెల్త్ సర్ చార్జ్ ఇతర ఫీజులు పెరుగుతాయని ఆయన గురువారం స్పష్టం చేశారు. దేశంలో ప్రభుత్వ వైద్య సిబ్బంది జీతాలు పెంచనున్న నేపథ్యంలో వీసాకు సంబంధించిన వైద్య ఖర్చులు కూడా పెరుగుతాయని అన్నారు.
 
టీచర్లు, పోలీసులు, జూనియర్ డాక్టర్లతో పాటు ఇతర ప్రభుత్వ సిబ్బంది వేతనాలు పెంచాలంటూ ఇటీవల బ్రిటన్‌లోని ఓ స్వతంత్ర కమిటీ సూచించింది. ఈ ప్రతిపాదనలకు ఆమోదించాలని బ్రిటన్ ప్రధానిపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
ప్రభుత్వ సిబ్బంది సగటు వేతనాలు 5 నుంచి 7 శాతం మేర పెరుగుతుందని చెప్పుకొచ్చారు. అయితే, ఈ ఖర్చులకు అప్పుల చేసి నిధులు సమీకరించబోమని ఆయన స్పష్టంచేశారు. భవిష్యత్తులో ద్రవ్యోల్బణం పరిగే అవకాశం ఉన్నందున ఇలాంటి చర్యకు పూనుకోమని స్పష్టం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments