Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో ఆగని కాల్పుల మోత - ఇద్దరు మృతి

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (08:29 IST)
అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ కాల్పుల సంస్కృతి మరింతగా హెచ్చుమీరిపోతోంది. మంగళవారం ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోస్టల్‌ సర్వీస్‌ ఉద్యోగులు మృతిచెందారు. 
 
అమెరికాలోని మెమ్‌ఫిస్‌లోని టెన్నెస్సీ పోస్టాఫీస్‌లో ఓ వ్యక్తి విచక్షణారహితంగా ఈ కాల్పులకు తెగబడ్డాడు. దీంతో యూఎస్‌ పోస్టల్‌ సర్వీస్‌ ఉద్యోగులు ఇద్దరు చనిపోయారు. అయితే కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా పోస్టల్‌ ఉద్యోగే కావడం గమనార్హం. 
 
కాల్పులు జరిపిన వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతనికోసం పోలీసులు గాలిస్తున్నట్టు పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌ సుసాన్‌ తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని చెప్పారు.
 
కాగా, ఇటీవలి కాలంలో అమెరికాలో కాల్పులకు పాల్పడటం సర్వ సాధారణమైపోయింది. దేశంలో ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో దుండగులు తుపాకీతో విరుచుకుపడుతూనే ఉన్నారు. ఈ కాల్పుల్లో పలువురు అమాయక ప్రజలు, అధికారులు ప్రాణాలు కోల్పోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments