Webdunia - Bharat's app for daily news and videos

Install App

10 -15 నిమిషాలు ఉండివుంటే నన్నూ చంపేసేవారే!... టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్

టర్కీ తిరుగుబాటు చేదు జ్ఞాపకాలను ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఓ సారి నెమరు వేసుకుంటున్నారు. తాను అప్రమత్తంగా లేకుండా ఉండివుంటే నన్నూ చంపేసేవారే అని ఆయన వ్యాఖ్యానించారు.

Webdunia
బుధవారం, 20 జులై 2016 (15:35 IST)
టర్కీ తిరుగుబాటు చేదు జ్ఞాపకాలను ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఓ సారి నెమరు వేసుకుంటున్నారు. తాను అప్రమత్తంగా లేకుండా ఉండివుంటే నన్నూ చంపేసేవారే అని ఆయన వ్యాఖ్యానించారు. అదేసమయంలో తిరుగుబాటు చేసిన సైనికులకు ఉరిశిక్ష విధించే అంశాన్ని కూడా తోసిపుచ్చలేమని ఆయన సూచన ప్రాయంగా వెల్లడించారు. 
 
ఇటీవల టర్కీ సైన్యంలోని ఓ వర్గం తిరుగుబాటు చేయగా, దీన్ని ఆదేశ ప్రజలు ఉక్కుపాదంతో అణిచివేసిన విషయం తెల్సిందే. అయితే, తిరుగుబాటు చేదు జ్ఞాపకాలు మాత్రం ఆ దేశ ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే రెండు సార్లు జరిగిన తిరుగుబాటుతో అతలాకుతలమైన ఆ దేశం ఇప్పుడిప్పుడే ఓ దారిన పడుతోంది. ఈ క్రమంలో మరో తిరుగుబాబు ఎదురైతే ఎలాగన్న భయమే జనాన్ని స్వచ్ఛందంగా రోడ్డపైకి వచ్చేలా చేసింది. 
 
ఈ తిరుగుబాటుపై అధ్యక్షుడు ఎర్డోగాన్ స్పందిస్తూ.. తిరుగుబాబు సందర్భంగా తనకు ఎదురైన చేదు అనుభవం భయానకమైనదన్నారు. ‘‘తిరుగుబాటు జరిగిన రాత్రి నేను విశ్రాంతి తీసుకుంటున్న మర్మరీస్ పట్టణాన్ని తిరుగుబాటు దారులు ముట్టడించారు. ఇంకో 10, 15 నిమిషాలు నేను అక్కడే ఉన్నట్లైతే... నన్నూ చంపేసేవారు. లేదా బందీగా పట్టుకుని ఉండేవారు’’ అని ఆయన అని మీడియాకు వివరించారు.

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments