Webdunia - Bharat's app for daily news and videos

Install App

టర్కీలో మరోమారు భూకంపం - వణకిపోతున్న పౌరులు

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (10:21 IST)
వారం రోజుల క్రితం సంభించిన భూకంపం కారణంగా టర్కీ, సిరియా దేశాల్లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొనివున్నాయి. ఈ రెండు దేశాల్లో మృతుల సంఖ్య  30 వేలకు పైమాటగానే ఉంది. ముఖ్యంగా, టర్కీలో పరిస్థితి మరింత భయానకరంగా ఉంది. శిథిలాలను తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. 
 
ఇక్కడ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా టర్కీలో మరోమారు భూకంపం సంభవించింది. ఆదివారం టర్కీలోని దక్షిణ నగరమైన కహ్రమన్మరాస్‌లో 4.7 తీవ్రతతో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అయితే, దీనివల్ల పెద్దగా  ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదు. 
 
మరోవైపు, టర్కీ, సిరియా దేశాల్లో భూకంప మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 34,179 మంది చనిపోయారు. ఇందులో ఒక్క టర్కీలోనే 29605 మంది చనిపోయారు. సిరియాలో 1574 మంది మృత్యువాతపడ్డారు. భవన శిథిలాలను తొలగించే గకొద్దీ మృతదేహాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. 
 
అయితే, భూకంప మృతుల సంఖ్య 50 వేలకు పైగా దాటొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు, టర్కీ, సిరియా దేశాల్లో సహాయక చర్యలు చేపట్టడంలోనూ, సాయం అందించడంలోనూ ఐక్యరాజ్య సమితి పూర్తిగా విఫలమయ్యిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments