Webdunia - Bharat's app for daily news and videos

Install App

టర్కీలో మరోమారు భూకంపం - వణకిపోతున్న పౌరులు

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (10:21 IST)
వారం రోజుల క్రితం సంభించిన భూకంపం కారణంగా టర్కీ, సిరియా దేశాల్లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొనివున్నాయి. ఈ రెండు దేశాల్లో మృతుల సంఖ్య  30 వేలకు పైమాటగానే ఉంది. ముఖ్యంగా, టర్కీలో పరిస్థితి మరింత భయానకరంగా ఉంది. శిథిలాలను తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. 
 
ఇక్కడ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా టర్కీలో మరోమారు భూకంపం సంభవించింది. ఆదివారం టర్కీలోని దక్షిణ నగరమైన కహ్రమన్మరాస్‌లో 4.7 తీవ్రతతో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అయితే, దీనివల్ల పెద్దగా  ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదు. 
 
మరోవైపు, టర్కీ, సిరియా దేశాల్లో భూకంప మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 34,179 మంది చనిపోయారు. ఇందులో ఒక్క టర్కీలోనే 29605 మంది చనిపోయారు. సిరియాలో 1574 మంది మృత్యువాతపడ్డారు. భవన శిథిలాలను తొలగించే గకొద్దీ మృతదేహాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. 
 
అయితే, భూకంప మృతుల సంఖ్య 50 వేలకు పైగా దాటొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు, టర్కీ, సిరియా దేశాల్లో సహాయక చర్యలు చేపట్టడంలోనూ, సాయం అందించడంలోనూ ఐక్యరాజ్య సమితి పూర్తిగా విఫలమయ్యిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anupama : దెయ్యంలా వుంటావని అమ్మ తిడుతుండేది : అనుపమ పరమేశ్వరన్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

తర్వాతి కథనం
Show comments