Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్న చైనా.. ఇప్పుడు భారత్,రష్యాలపై దుమ్మెత్తి పోసిన ట్రంప్

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (07:48 IST)
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంతే.. ఆయన మారరుగాక మారరు. ఆ దేశంలో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఆయన చిత్ర విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. నిన్నటి వరకు చైనాపై చిందులేసిన ఆయన.. ఇప్పుడు రష్యా, భారత్ పైనా దుమ్మెత్తి పోస్తున్నారు.
 
భారత్‌, చైనా, రష్యాలు వెలువరించే కర్బన ఉద్గారాల గురించి ఎలాంటి రక్షణ తీసుకోలేదని నిందించారు. అమెరికా చేసినంత కూడా ఈ దేశాలు చేయలేదని, పైగా లెక్కలేనన్ని పరిమితులు విధిస్తారని, అందుకే పారిస్‌ వాతావారణ ఒప్పందం నుంచి తాము వైదొలిగామని ట్రంప్‌ చెప్పారు.

టెక్సాస్‌లోని మిడ్‌ల్యాండ్‌లో సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే డెమొక్రాట్లపై విమర్శలు కూడా చేశారు. ఈ పిచ్చి డెమోక్రాట్లు లెక్కలేనన్ని అమెరికా ఉద్యోగాలు, ఫ్యాక్టరీలు, పరిశ్రమలను చైనాకు తరలిస్తారని విమర్శించారు.

'మన గాలి గురించి మనం శ్రద్ధ తీసుకోవాలని వారు కోరుకుంటారు. కానీ చైనా తన గాలి గురించి శ్రద్ధ తీసుకోదు. భారత్‌ తన గాలి గురించి శ్రద్ధ తీసుకోదు. రష్యా కూడా శ్రద్ధ తీసుకోదు. కానీ, మనం చేయాలి' అని ట్రంప్‌ అన్నారు. తాను అధికారంలోకి ఉన్నంత వరకూ అమెరికాను అగ్రస్థానంలో ఉంచుతానని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత ఆ దర్శకుడుతో ప్రేమలో ఉందా? హీరోయిన్ మేనేజరు ఏమంటున్నారు?

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments