Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రంప్ వీరాభిమాని కరోనాతో మృతి

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (07:06 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీరాభిమాని ఇక లేరు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన బుస్స కృష్ణ(40).. ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. డొనాల్డ్ ట్రంప్‌ కరోనా బారినపడినప్పటి నుంచి కృష్ణ తీవ్ర మనోవేదనకు గురయ్యారు.

ఈ క్రమంలోనే ఆయన గుండె పోటుతో మృతి చెందినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. కాగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అభిమానంతో కృష్ణ.. తన ఇంటి వద్ద ట్రంప్ విగ్రహాన్ని పెట్టి గత కొద్ది రోజులుగా పూజలు చేస్తున్నారు. అంతేకాకుండా ట్రంప్‌ను కలవడం తన చిరకాల కోరిక అని.. బుస్స కృష్ణ పలు ఇంటర్యూల్లో వెల్లడించారు.

ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలుసుకున్న ట్రంప్.. భారత పర్యటనకు వచ్చినప్పుడు కృష్ణ‌ను కలుస్తానంటూ హామీ ఇచ్చారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో కుటుంబ సమేతంగా ఇండియాలో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు.. కృష్ణను కలవకుండానే వెనుదిరిగారు.

నవంబర్ 3న జరగబోయే ఎన్నికల్లో ట్రంప్ కచ్చితంగా విజయం సాధిస్తారని.. కృష్ణ అశాభావం వ్యక్తం చేశారు. అయితే ట్రంప్‌ను కలవాలనే చిరకాల కోరిక తీరకుండానే బుస్స కృష్ణ కన్నుమూశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments