Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ దెబ్బకు రోజుకు 3 వేల మంది మృతి.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 6 మే 2020 (12:39 IST)
కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటినీ వణికిస్తోంది. ఈ వైరస్ బారినపడని దేశాలు అతి తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. దాదాపు 250కి పైగా దేశాలు ఈ వైరస్ కోరల్లో చిక్కుకుని ఉన్నాయి. అలాంటి దేశాల్లో అగ్రరాజ్యం అమెరికా కూడా ఉంది. ప్రపంచ దేశాల్లో అత్యధిక బాధిత దేశాల్లో అమెరికా ఇపుడు అగ్రస్థానంలో ఉంది. అయినప్పటికీ ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ డోంట్ కేర్ అంటున్నారు. 
 
అయితే, వచ్చే జూన్ ఒకటో తేదీ తర్వాత రోజుకు మూడు వేల మంది చొప్పున కరోనా వైరస్ దెబ్బకు చనిపోతారని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంచనావేసింది. న్యూయార్క్ టైమ్స్ నుంచి పొందిన సీడీసీ డాక్యుమెంట్ల లెక్కల ప్రకారం చనిపోయేవారి సంఖ్యను ట్రంప్ పాలనా యంత్రాంగం అంచనావేసింది. అయితే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే చర్యలు, వారాంతాల్లో పార్కులకు వచ్చే వారి సంఖ్యను ఆధారంగా ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. 
 
ప్రధానంగా ఫ్లోరిడా, కొలరాడో, ఇండియానా, నెబ్రస్కా, సౌత్ కరోలినా, వెస్ట్ వర్జీనియాతో పాటు.. ఇతర రాష్ట్రాల్లో ఆంక్షలను సడలించారు. కుదేలైపోతున్న ఆర్థిక రంగానికి కొంతమేరకైనా ఉపశమనం కలిగించేందుకు ఈ సడలింపులు ఇవ్వడం జరిగింది. అయితే, ఈ సడలింపులు కారణంగా వైరస్ బారినపడే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments