చైనాలో భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు...

వరుణ్
మంగళవారం, 23 జనవరి 2024 (08:48 IST)
పొరుగుదేశం చైనాలో భూకంపం సంభవించింది. దీని ప్రభావం రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతగా నమోదైంది. ఈ భూకంపం ప్రభావం కారణంగా ఢిల్లీలో భూమి కంపించింది. ఈ భూకంప కేంద్రానికి భూమికి అడుగు భాగంలో 70 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రంగా గుర్తించారు. దీని ప్రభావం కారణంగా సోమవారం రాత్రి 11.39 గంటల సమయంలో ఢిల్లీలోనూ భూప్రకంపనలు కనిపించాయి. ఈ వివరాలను నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. అయితే, ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని పేర్కొంది. 
 
జనవరి 11వ తేదీన ఆప్ఘనిస్థాన్‌లో రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిన సమయంలో కూడా ఢిల్లీ రాజధాని ప్రాంతంలో భూప్రకంపనలు నమోదైన విషయం తెల్సిందే. ఆ భూకంపం కేంద్రం ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌కు ఈశాన్య దిశలో 241 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. దీంతో పాకిస్థాన్ దేశంలో కూడా భూప్రకంపనలు నమోదయ్యాయి. 
 
ఇదిలావుంటే, చైనా దేశంలో ఇటీవలి కాలంలో వరుసగా ప్రకృతి వైపరీత్యాలను చవిచూస్తుంది. సోమవారం ఉదయం నైరుతి చైనాలోని మారుమూల, పర్వత ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం ప్రభావంతో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఏకంగా 47 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. యున్నాన్ ప్రావిన్స్‌లోని జెన్ క్యాంగ్ కౌంటీలో సోమవారం ఉదయం 5.51 గంటల సమయంలో కొండ చరియలు విరిగిపడటంతో విపత్కర పరిస్థితి నెలకొందని చైనా మీడియా జిన్హువా వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments