Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసికందును మట్టిలో పాతిపెట్టారు.. శునకం కాపాడింది.. ఎలాగంటే?

Webdunia
శనివారం, 18 మే 2019 (11:52 IST)
థాయ్‌లాండ్‌‍లో కన్నతల్లి చేతులారా మట్టిలో పాతిపెట్టబడిన పసికందును ఓ శునకం రక్షించింది. తాను గర్భవతిని అయ్యానని.. 15 ఏళ్లలోనే పాపాయికి జన్మనిచ్చానని తెలిస్తే.. తల్లిదండ్రుల కోపానికి కారణమవుతానని జడుసుకున్న 15 ఏళ్ల యువతి.. తనకు పుట్టిన పసికందును ప్రాణాలతో మట్టిలో పాతిపెట్టింది.


థాయ్‌లాండ్‌లోని పెన్ నాంగ్ కామ్ అనే గ్రామంలో పింగ్ పాంగ్ అనే శునకం... పాపాయిని మట్టిలో పాతిపెట్టిన ప్రాంతాన్ని చూసి మొరగడం చేసింది. ఇంకా ఆ మట్టిని తవ్వింది. 
 
దీన్ని గమనించిన ఆ శునకం యజమాని.. ఆ మట్టి నుంచి శిశువు కాలు బయటికి రావడం చూసి షాకయ్యాడు. వెంటనే మట్టిలో పాతిపెట్టిన పసికందును చేతికి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ శిశువు పరీక్షించిన వైద్యులు పాపాయి ఆరోగ్యంగా వుందని.. చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఇక పింగ్ పాంగ్ అనే శునకం యజమాని పట్ల విశ్వాసంతో నడుచుకుంటుంది. 
 
కానీ ఇటీవల ఓ కారు ప్రమాదంలో పింగ్ పాంగ్ ఓ కాలు పని చేయకుండా పోయిందని శునకం యజమాని తెలిపారు. ఆ గ్రామంలో వున్న వారందరికీ పింగ్ పాంగ్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. ఇక పింగ్ పాంగ్ కనిపెట్టిన ఆ శిశువు తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ శిశువును ఆ యువతి తల్లిదండ్రులే పెంచాలని నిర్ణయించుకున్నారని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments