Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండోసారి పాజిటివ్ వచ్చిన వారి నుంచి కరోనా సోకదు

Webdunia
ఆదివారం, 30 ఆగస్టు 2020 (19:44 IST)
రెండవసారి పాజిటివ్‌ వచ్చినప్పటికి వారిలో ఎలాంటి రోగ లక్షణాలు కనిపించవని, వారినుంచి వైరస్‌ ఇతరులకు సోకే ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. కరోనా బారినుంచి కోలుకున్న వ్యక్తులకు మరో సారి పాజిటివ్‌ రావటానికి కారణం వారి శరీరంలోని మృత  వైరస్‌లేనని అన్నారు.

ఇటీవల హాంకాంగ్‌లో 33 ఏళ్ల వ్యక్తికి థెర్మల్‌ స్క్రీనింగ్‌లో కరోనా రెండవ సారి బయటపడిన సంగతి తెలిసిందే. దీంతో రెండవ సారి కరోనా సోకే విషయంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. 'క్లినికల్‌ ఇన్‌ఫెక్షస్‌ డీసీజెస్‌' జర్నల్‌లో ప్రచురించిన నివేదికలో శాస్త్రవేత్తలు దీనిపై క్లారిటీ ఇచ్చారు.

కరోనా సోకిన వ్యక్తి శరీరం వేగంగా న్యూట్రలైజింగ్‌ యాంటీ బాడీస్‌ను విడుదల చేస్తుందని, ఇన్‌ఫెక్షన్‌ తగ్గిన ఒకటి లేదా రెండు నెలల తర్వాత యాంటీ బాడీస్‌ సంఖ్య తగ్గిపోతుందని తెలిపారు.

శరీరంనుంచి వైరస్‌లను బయటకు పంపేసే ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో 'రివర్స్‌ ట్రాన్స్క్రిప్షన్‌ పాలిమరేస్‌ చైన్‌ రియాక్షన్‌' టెస్టుల్లో కోలుకున్న వ్యక్తులకు కూడా కొన్ని వారాల తర్వాత పాజిటివ్‌ వస్తుందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments