Webdunia - Bharat's app for daily news and videos

Install App

పఠాన్ కోట్ తరహా దాడి.. భారత యుద్ధ నౌకల్ని పేల్చేందుకు పాక్ కుట్ర

భారత యుద్ధ నౌకలను పేల్చేందుకు పాకిస్థాన్ కుట్ర పన్నినట్లు ఇంటెలిజన్స్ వర్గాలు పసిగట్టాయి. ఈ విషయాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వానికి చేరవేశాయి. దీంతో నేవీ దళాధికారులు అప్రమత్తమయ్యారు. పఠాన్ కోట్ తరహా దాడ

Webdunia
గురువారం, 19 జులై 2018 (13:27 IST)
భారత యుద్ధ నౌకలను పేల్చేందుకు పాకిస్థాన్ కుట్ర పన్నినట్లు ఇంటెలిజన్స్ వర్గాలు పసిగట్టాయి. ఈ విషయాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వానికి చేరవేశాయి. దీంతో నేవీ దళాధికారులు అప్రమత్తమయ్యారు. పఠాన్ కోట్ తరహా దాడికి పాల్పడి, విశాఖ తీరంలో ఉన్న యుద్ధ నౌకలను, జలాంతర్గాములను ధ్వంసం చేయాలన్న లక్ష్యంతో జైషే మొహమ్మద్ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. 
 
ఇందుకుగాను ఇప్పటికే పదిమంది ఉగ్రవాదులు డీప్ సీ డైవర్లుగా శిక్షణ పొందారని, వీరంతా ముజఫరాబాద్ సమీపంలో ఉన్న కెల్, దుధినిహల్, లీపా లోయల గుండా ఇండియాలో చొరబడవచ్చని ఇంటెలిజెన్స్ భావిస్తోంది. 
 
సముద్ర అంతర్భాగం ద్వారా జలాంతర్గాముల వద్దకు చేరుకుని.. వాటిని పేల్చే సాంకేతికత గురించి వారికి పూర్తి అవగాహన కూడా వుందని ఇంటలిజెన్స్ తెలిపింది. ఆధునిక ఆయుధ శిక్షణనూ వారు పూర్తి చేసుకున్నారని ఇంటెలిజెన్స్ సంస్థలను సమన్వయం చేసే మల్టీ ఏజెన్సీ సెంటర్ పేర్కొంది. నిఘా సంస్థలు హెచ్చరించడంతో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు భారత నేవీ అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments