Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొలంబస్‌ ఫుడ్‌కోర్టులో కాల్పుల కలకలం.. ఏలూరులో విషాదం...

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (10:02 IST)
అమెరికాలో మరోమారు కాల్పులు మోత మోగింది. ఓహియో రాష్ట్ర రాజధాని కొలంబస్‌లోని ఓ ఫుడ్‌కోర్టులో ఇద్దరు దుండగులు జరిపిన కాల్పుల్లో తెలుగు విద్యార్థి ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. రాజధాని కొలంబస్ నగరంలోని ఓ ఫుడ్ కోర్టులోకి చొరబడిన దండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన తెలుగు విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. 
 
ఓహియో రాష్ట్రం రాష్ట్ర రాజధాని కొలంబస్‌లోని ఫ్రాంక్లిన్ గ్యాస్ స్టేషన్ వెనుక ఓ ఫుడ్‌ కోర్టు ఉంది. ఇక్కడ స్థానిక కాలమానం ప్రకారం గురువారం అర్థరాత్రి 12.50 గంటల సమయంలో ఇద్దరు అగంతుకులు ఫుడ్‌కోర్టులో ప్రవేశించి తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాకు చెందిన సాయీశ్ వీర (24) తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు.
 
వెస్ట్ బ్రాడ్‌ స్ట్రీట్‌లోని షెల్ గ్యాస్ స్టేషన్‌లో సాయీశ్ వీర క్లర్కుగా పని చేస్తున్నాడు. సాయీశ్ మరణ వార్త తెలిసిన అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన సాయీశ్ హెచ్1బి వీసా కూడా తీసుకున్నాడు. కాగా, ఈ దారుణానికి పాల్పడిన నిందింతుల ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments