Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియాలో తెలుగు విద్యార్థి మృతి.. మెదడు సంబంధిత వ్యాధితో..

Webdunia
శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (11:22 IST)
ఆస్ట్రేలియాలో ఓ తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. సదరన్‌ క్రాస్‌ యూనివర్సిటీలో చదువుతున్న హరిశివశంకర్‌ రెడ్డి నాగారం మెదడు సంబంధిత వ్యాధితో మరణించినట్లు అధికారులు తెలిపారు. ఆయన మరణం పట్ల వర్సిటీ యాజమాన్యం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. 
 
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. గతవారం తీవ్ర అస్వస్థతకు గురైన హరిశివశంకర్‌ను బ్రిస్బేన్‌లోని ప్రిన్సెస్‌ అలెగ్జాండ్రియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. కానీ, మెదడులో రక్తస్రావం తీవ్రమవడంతో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు చెప్పారు.
 
యూనివర్సిటీకి చెందిన గోల్డ్‌ కోస్ట్‌ క్యాంపస్‌లో హరిశివశంకర్‌ ఐటీ స్పేషలైజేషన్‌లో మాస్టర్స్‌ చదువుతున్నారు. ఆయన ఎంతో నిబద్ధత గల విద్యార్థి అని వర్సిటీ చీఫ్‌ ఇంటర్నేషనల్‌ ఆఫీసర్‌ మాంటీ సింగ్‌ విచారం వ్యక్తం చేశారు.
 
తెలంగాణలోని ఆయన కుటుంబ సభ్యులతో విశ్వవిద్యాలయ యాజమాన్యం ప్రస్తుతం సంప్రదింపులు కొనసాగిస్తోంది. కావాల్సిన సాయం అందిస్తోంది. ఈ వారాంతంలోగా మృతదేహాన్ని ఇంటికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments