Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియాలో తెలుగు విద్యార్థి మృతి.. మెదడు సంబంధిత వ్యాధితో..

Webdunia
శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (11:22 IST)
ఆస్ట్రేలియాలో ఓ తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. సదరన్‌ క్రాస్‌ యూనివర్సిటీలో చదువుతున్న హరిశివశంకర్‌ రెడ్డి నాగారం మెదడు సంబంధిత వ్యాధితో మరణించినట్లు అధికారులు తెలిపారు. ఆయన మరణం పట్ల వర్సిటీ యాజమాన్యం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. 
 
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. గతవారం తీవ్ర అస్వస్థతకు గురైన హరిశివశంకర్‌ను బ్రిస్బేన్‌లోని ప్రిన్సెస్‌ అలెగ్జాండ్రియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. కానీ, మెదడులో రక్తస్రావం తీవ్రమవడంతో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు చెప్పారు.
 
యూనివర్సిటీకి చెందిన గోల్డ్‌ కోస్ట్‌ క్యాంపస్‌లో హరిశివశంకర్‌ ఐటీ స్పేషలైజేషన్‌లో మాస్టర్స్‌ చదువుతున్నారు. ఆయన ఎంతో నిబద్ధత గల విద్యార్థి అని వర్సిటీ చీఫ్‌ ఇంటర్నేషనల్‌ ఆఫీసర్‌ మాంటీ సింగ్‌ విచారం వ్యక్తం చేశారు.
 
తెలంగాణలోని ఆయన కుటుంబ సభ్యులతో విశ్వవిద్యాలయ యాజమాన్యం ప్రస్తుతం సంప్రదింపులు కొనసాగిస్తోంది. కావాల్సిన సాయం అందిస్తోంది. ఈ వారాంతంలోగా మృతదేహాన్ని ఇంటికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments