Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియాలో తెలుగు విద్యార్థి మృతి.. మెదడు సంబంధిత వ్యాధితో..

Webdunia
శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (11:22 IST)
ఆస్ట్రేలియాలో ఓ తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. సదరన్‌ క్రాస్‌ యూనివర్సిటీలో చదువుతున్న హరిశివశంకర్‌ రెడ్డి నాగారం మెదడు సంబంధిత వ్యాధితో మరణించినట్లు అధికారులు తెలిపారు. ఆయన మరణం పట్ల వర్సిటీ యాజమాన్యం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. 
 
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. గతవారం తీవ్ర అస్వస్థతకు గురైన హరిశివశంకర్‌ను బ్రిస్బేన్‌లోని ప్రిన్సెస్‌ అలెగ్జాండ్రియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. కానీ, మెదడులో రక్తస్రావం తీవ్రమవడంతో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు చెప్పారు.
 
యూనివర్సిటీకి చెందిన గోల్డ్‌ కోస్ట్‌ క్యాంపస్‌లో హరిశివశంకర్‌ ఐటీ స్పేషలైజేషన్‌లో మాస్టర్స్‌ చదువుతున్నారు. ఆయన ఎంతో నిబద్ధత గల విద్యార్థి అని వర్సిటీ చీఫ్‌ ఇంటర్నేషనల్‌ ఆఫీసర్‌ మాంటీ సింగ్‌ విచారం వ్యక్తం చేశారు.
 
తెలంగాణలోని ఆయన కుటుంబ సభ్యులతో విశ్వవిద్యాలయ యాజమాన్యం ప్రస్తుతం సంప్రదింపులు కొనసాగిస్తోంది. కావాల్సిన సాయం అందిస్తోంది. ఈ వారాంతంలోగా మృతదేహాన్ని ఇంటికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments