Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా వెళ్లిన తెలుగు విద్యార్థి.. రోడ్డు ప్రమాదంలో మృతి

సెల్వి
బుధవారం, 3 ఏప్రియల్ 2024 (10:10 IST)
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడు ఆచంట రేవంత్ ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా పర్చూరు మండలం బోడవాడకు చెందినవాడు. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన 22 ఏళ్ల రేవంత్‌ గత ఏడాది డిసెంబర్‌లో ఎంఎస్‌ చేసేందుకు అమెరికా వెళ్లినట్లు బంధువులు తెలిపారు. అతను ప్రస్తుతం మాడిసన్ ప్రాంతంలోని డకోటా స్టేట్ యూనివర్శిటీలో చదువుతున్నాడు.
 
సమాచారం ప్రకారం, మంగళవారం పుట్టినరోజు వేడుకల కోసం ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో వెళుతుండగా ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడంతో కారు అదుపు తప్పి బోల్తా పడింది. 
 
ఈ ప్రమాదంలో రేవంత్‌తో పాటు ముగ్గురు స్నేహితులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే రేవంత్ మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. ఆయన మృతితో స్వగ్రామమైన బోడవాడ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 
 
రేవంత్ తల్లి కొన్నేళ్ల క్రితం మరణించగా, తండ్రి రఘుబాబు ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన కుమారుడి అకాల మరణం ఆ తండ్రి హృదయాన్ని కలచివేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

కథంతా చెప్పేసిన థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments