Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా వెళ్లిన తెలుగు విద్యార్థి.. రోడ్డు ప్రమాదంలో మృతి

సెల్వి
బుధవారం, 3 ఏప్రియల్ 2024 (10:10 IST)
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడు ఆచంట రేవంత్ ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా పర్చూరు మండలం బోడవాడకు చెందినవాడు. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన 22 ఏళ్ల రేవంత్‌ గత ఏడాది డిసెంబర్‌లో ఎంఎస్‌ చేసేందుకు అమెరికా వెళ్లినట్లు బంధువులు తెలిపారు. అతను ప్రస్తుతం మాడిసన్ ప్రాంతంలోని డకోటా స్టేట్ యూనివర్శిటీలో చదువుతున్నాడు.
 
సమాచారం ప్రకారం, మంగళవారం పుట్టినరోజు వేడుకల కోసం ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో వెళుతుండగా ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడంతో కారు అదుపు తప్పి బోల్తా పడింది. 
 
ఈ ప్రమాదంలో రేవంత్‌తో పాటు ముగ్గురు స్నేహితులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే రేవంత్ మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. ఆయన మృతితో స్వగ్రామమైన బోడవాడ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 
 
రేవంత్ తల్లి కొన్నేళ్ల క్రితం మరణించగా, తండ్రి రఘుబాబు ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన కుమారుడి అకాల మరణం ఆ తండ్రి హృదయాన్ని కలచివేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments