Webdunia - Bharat's app for daily news and videos

Install App

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

ఠాగూర్
శుక్రవారం, 20 జూన్ 2025 (18:25 IST)
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ మరోమారు వార్తల్లో నిలిచారు. వంద మంది పిల్లలకు జన్మనిచ్చానని, వారికి తన యావదాస్తి చెందేలా వీలునామా రాసినట్టు తెలిపారు. అయితే, వంద మంది పిల్లలకు తన వీర్యదానంతో జన్మనిచ్చానని చెప్పారు. ఈ మేరకు తన భవిష్యత్ ప్రణాళికను వెల్లడించారు. 
 
15 యేళ్ళపాటు తాను చేసిన వీర్యదానంతో ప్రపంచ వ్యాప్తంగా 12 దేశాల్లో 100 మంది పిల్లలు జన్మించినట్టు గత యేడాది జూలైలో ప్రకటించిన విషయం తెల్సిందే. తాజాగా ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి ప్రస్తావించిన ఆయన.. మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఇటీవలే తాను వీలునామా రాశాని, అందులో ఈ సంతానం గురించి కూడా పేర్కొన్నట్టు తెలిపారు. 
 
తాను సహజంగా జన్మనిచ్చిన సంతానంతో పాటు ఈ 100 మంది పిల్లలకు కూడా తన ఆస్తిలో సమాన హక్కు ఉంటుందని వెల్లడించారు. దాదాపు 10 బిలియన్ డాలర్ల తన సంపదను వీరందరికీ సమానంగా పంచుతానని, తన వీలునామాలో పేర్కొన్నట్టు తెలిపారు. అయితే, ఈ సంపదను 30 యేళ్ల వరకు వారు పొందలేరని తన పిల్లలు స్వతంత్రంగా జీవించేలా ఎదగాలని  కోరుకుంటున్నట్టు పావెల్ పేర్కొన్నారు. 
 
తనకు ఇంకా వివాహం కానప్పటికీ తనకు ముగ్గురు సహజీవన భాగస్వాములు ఉన్నారని, వారికి ఆరుగురు సంతానం అని ఆయన తెలిపారు. తన జీవితం ఎన్నో సవాళ్లతో ముడిపడివుందని, ఎంతమంది శత్రువులు కూడా ఉన్నారని తెలిపారు. అందుకే 40 యేళ్ల వయుసులోనే వీలునామా రాయాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుంత ఈ కథనం నెట్టింట వైరల్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments