Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంఎస్ కోసం చికాగో వెళ్లాడు.. పెట్రోల్ బంకులో పార్ట్‌టైమ్ చేశాడు.. కానీ..?

సెల్వి
ఆదివారం, 1 డిశెంబరు 2024 (12:44 IST)
శనివారం అమెరికాలోని చికాగోలోని పెట్రోల్ బంక్ వెలుపల తెలంగాణకు చెందిన 22 ఏళ్ల యువకుడిని దుండగుడు కాల్చి చంపాడు. మృతుడు ఖమ్మం జిల్లాకు చెందిన సాయి తేజ నూకారపు అని తెలిసింది.

ఇతను పెట్రోల్ పంపులో పని చేస్తున్నాడు. ఆ సమయంలో పెట్రోల్ బంకుపై పడిన దుండగుడు అతని నుండి డబ్బు లాక్కోవడంతో పాటు కాల్పులు జరిపి అక్కడి నుండి పారిపోయాడు. బీబీఏ పూర్తి చేసిన సాయి తేజ నాలుగు నెలల క్రితం విస్కాన్సిన్‌లోని కాంకోర్డియా యూనివర్సిటీలో ఎంఎస్‌ చేసేందుకు అమెరికా వెళ్లారు. 
 
గత కొన్ని రోజులుగా పెట్రోల్‌ పంపులో పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తున్నాడు. దుండగలు దోపిడీని పూర్తి చేసి, బయలుదేరబోతున్నప్పుడు, అతను ప్రతిఘటించడానికి ప్రయత్నించకపోయినా, వారు అతనిని కాల్చి చంపారు. ఈ ఘటనపై  విదేశాంగ మంత్రి (ఈఏఎం) ఎస్ జైశంకర్ సంతాపం వ్యక్తం చేస్తూ, మృతుడి కుటుంబానికి భారత కాన్సులేట్ అన్ని విధాలా సహాయాన్ని అందజేస్తోందని తెలిపారు. 
Sai Teja
 
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) సభ్యులతో మాట్లాడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడంలో వారి సహాయం కోరినట్లు తెలుస్తోంది. మృతదేహం వచ్చే వారం భారత్‌కు చేరుకునే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments