Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా స్నేహితురాలు తాలిబన్ చేతిలో హతమైంది: అబ్ధుల్ ఖాదిర్

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (11:53 IST)
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ నగరాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఢిల్లీకి వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ ఎంపీ అబ్దుల్ ఖాదిర్ జజాయ్ మీడియాతో మాట్లాడారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం, తాలిబన్ మధ్య శాంతి చర్చలు జరిగాయని, దీంతో కాబుల్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయన్నారు. 
 
తాలిబన్‌ను సమర్థిస్తున్న దేశాలలో పాకిస్థాన్ ఒకటన్నారు. తన కుటుంబం ఇంకా కాబూల్‌లోనే ఉందని తెలిపారు. ఇదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుని సీనియర్ సలహాదారు రిజ్వానుల్లా అహ్మద్‌జాయ్ మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం నెలకొందని, కాబూల్‌లోని రాజకీయనేతలంతా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వచ్చేశారన్నారు.
 
200 మంది ప్రముఖులు ఢిల్లీ చేరుకున్నారని తెలిపారు. మరో ఎంపీ సయ్యద్ హసన్ మాట్లాడుతూ.. తాము తమ దేశాన్ని విడిచిపెట్టాలనుకోవడం లేదన్నారు. ఇక్కడ తాము ఒక సమావేశానికి వచ్చామని, అది ముగియగానే తిరిగి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లిపోతామన్నారు. 
 
కాగా కాబూల్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఒక మహిళ మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్‌కు ప్రపంచం మద్దతుగా నిలుస్తుందనే నమ్మకం తనకు లేదన్నారు. తన స్నేహితురాలు తాలిబన్ చేతిలో హతమయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అక్కడ ఎటువంటి అధికారాలు లేవని వాపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments