Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాలిబన్ల కాల్పులు.. కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద తొక్కిసలాట

Webdunia
ఆదివారం, 22 ఆగస్టు 2021 (14:29 IST)
తాలిబన్ తీవ్రవాదుల వశమైన ఆప్ఘనిస్థాన్‌లో పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయి. ఆప్ఘన్ దేశాన్ని తాలిబన్ల ఆక్రమణ తర్వాత ఆ దేశాన్ని వీడేందుకు పెద్ద ఎత్తున ఆప్ఘన్ పౌరులు కాబూల్‌ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు.
 
తాలిబన్ల అరాచకాలతో దేశం విడిచి వెళ్లేందుకు అఫ్గన్ పౌరులు కాబూల్ విమానాశ్రయానికి పోటెత్తుతున్నారు. ముష్కరుల దురాగతాల నుంచి తప్పించుకోవాలనే తాపత్రయంలో ప్రాణాలను సైతం ఫణంగా పెడుతున్నారు. 
 
గతవారం బయలుదేరుతున్న అమెరికా విమానం రెక్కలపైకి ఎక్కి వెళ్లేందుకు ప్రయత్నించి ముగ్గురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. తాజాగా, కాబూల్ విమానాశ్రయానికి భారీ సంఖ్యలో జనం చేరుకోవడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఏడుగురు అఫ్గన్ పౌరులు మృతిచెందారు.
 
విమానాశ్రయానికి జనం పోటెత్తడంతో తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరపడం వల్ల పరిస్థితి అదుపుతప్పి తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు బ్రిటన్ రక్షణ శాఖ వెల్లడించింది. ఈ ఘటనలో ఏడుగురు అఫ్గన్ పౌరులు చనిపోయారని, మరికొందరు గాయపడ్డారని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments