Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిరియాలో ఉగ్రవాదుల భీభత్సం.... 148 మందికి పైగా మృతి

Webdunia
మంగళవారం, 24 మే 2016 (09:35 IST)
సిరియాలోని జాబ్లే, టార్టస్ నగరాలపై ఐసిఐస్ ఉగ్రవాదులు భీభత్సం సృష్టించారు. సిరియాలో వేర్వేరు ప్రాంతాల్లో జరిపిన వరుస బాంబు దాడుల్లో 148 మంది చనిపోయారు. జాబ్లేలో 100 మంది, టార్టస్‌లో మరో 48 మంది చనిపోయారు. వందలాది మందికి తీవ్రగాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. టాకియా ప్రావిన్సులోని టార్టస్, జబ్‌లేహ్ నగరాల్లో లెవాంట్ గ్రూపుకు చెందిన జిహాదీలు ఆత్మాహుతి దాడులు, కారు బాంబు దాడులు చేసి విధ్వంసం సృష్టించారు. బస్‌స్టేషన్లను, ఇతర రద్దీ నగరాలను టార్గెట్ చేస్తూ ఈ దాడికి పాల్పడ్డారు.
 
 టార్టస్ నగరంలో సుమారు మూడు చోట్ల  భారీ బాంబు పేలుళ్లు సంభవించాయి. జబ్‌లేహ్ నగరంలో మరో నాలుగు బాంబు పేలుళ్లు సంభవించాయి. వీటిలో ఎక్కువ ఆత్మాహుతి దాడులే. అయితే ఆ పేలుళ్లకు తామే కారణమంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అమాక్ వెబ్‌సైట్ ద్వారా బహిరంగంగా ప్రకటించడం గమనార్హం. 2011 మార్చిలో సిరియా సంక్షోభం మొదలైనప్పటి నుంచీ ఇవే అతి ప్రాణాంతక దాడులని సిరియా  మానవ హక్కుల సంస్థ అధిపతి అబ్దెల్ రహ్మాన్ చెప్పారు. టార్టస్‌లో బస్ స్టేషన్‌లో బాంబు పేలుడు దృశ్యాన్ని ప్రభుత్వ టీవీ ప్రసారం చేసింది.  కాలిపోయిన మృతదేహాలు చెల్లాచెదురుగా రక్తపుమడుగులో పడివుండటం ప్రజలకు భయాందోళన కలిగించింది. జాబ్లేలో ఒక బస్‌స్టేషన్‌తో పాటు ప్రభుత్వ ఆస్పత్రి‌పైనా ఉగ్రవాదులు దాడి చేశారు.
 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments