Webdunia - Bharat's app for daily news and videos

Install App

శవాన్ని సూపర్ మార్కెట్లో పెట్టుకుని వ్యాపారం చేస్తారా? మానవత్వం ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (20:52 IST)
umbrellas
మానవత్వం మంటగలిసిపోయింది. కరోనా వంటి రోగాలు వచ్చినా.. మనిషిలో మానవత్వం లేకుండా పోయింది. తాజాగా ఓ సూపర్ మార్కెట్‌లో పనిచేసే వ్యక్తి చనిపోతే.. సదరు సూపర్ మార్కెట్ యాజమాన్యం మాత్రం అస్సలు పట్టించుకోలేదు.

అతని కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం అందివ్వకుండా శవం మీద గొడుగులు కప్పి పేలాలు ఏరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్ కావడంతో ఆ సూపర్ మార్కెట్ నిర్వాకం బయటి ప్రపంచానికి తెలిసింది. దీంతో యాజమాన్యం తాము చేసిన పనికి క్షమాపణలు చెప్పింది. ఈ వ్యవహారంలో బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్‌లోని కర్రెఫోర్ సూపర్ మార్కెట్‌లో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న మోయిసెస్ సంతోస్ కవాల్కంటే అనే ఉద్యోగి గుండె నొప్పితో అస్వస్థతకు గురయ్యాడు. అయితే అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా స్టోర్‌లోనే అత్యవసర చికిత్స అందించారు. ఆ చికిత్స సరిపోకపోయేసరికి అతను మృతిచెందాడు. అతను మరణించినా.. యాజమాన్యం ఏ మాత్రం పట్టించుకోలేదు. 
 
అతని కుటుంబానికి సమాచారం అందివ్వలేదు. అతని చావుతో తమ వ్యాపారం ఎక్కడ ఆగిపోతుందోనని శవాన్ని ఒక మూలన పెట్టి చుట్టూ గొడుగులు, డబ్బాలు కప్పారు. ఈ విషయం తెలిసిన కొంతమంది ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి కాస్తా వైరల్ కావడంతో ఆ సూపర్ మార్కెట్ యాజమాన్యంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అని నెటిజన్లు చీవాట్లు పెడుతున్నారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments