Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో కాల్పులు.. తెలుగు విద్యార్థి మృతి...

అమెరికాలో మరోమారు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో తెలుగు విద్యార్థి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ విద్యార్థి పేరు శరత్ కొప్పు. వయసు 26 యేళ్లు. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా కొత్తవాడ వాసవీ కాలనీవాసిగ

Webdunia
ఆదివారం, 8 జులై 2018 (09:59 IST)
అమెరికాలో మరోమారు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో తెలుగు విద్యార్థి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ విద్యార్థి పేరు శరత్ కొప్పు. వయసు 26 యేళ్లు. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా కొత్తవాడ వాసవీ కాలనీవాసిగా గుర్తించారు.
 
అమెరికాలోని కేన్సస్ సిటీలోని యూనివర్శిటీ ఆఫ్ మిస్సోరిలో ఎమ్మెస్ చేస్తున్న శరత్ తన స్నేహితులతో కలిసి శనివారం రాత్రి ఏడు గంటల సమయంలో స్థానికంగా ఉండే ఓ రెస్టారెంట్‌కు డిన్నర్‌కి వెళ్లాడు. ఆ సమయంలో రెస్టారెంట్‌కు వచ్చిన ఓ దుండగుడు అక్కడున్న వారిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాడు. 
 
ఈ కాల్పులు జరిపే సమయంలో అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన శరత్‌పై దుండగుడు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయాడు. రక్తపు మడుగులోపడిన శరత్‌ను అతని స్నేహితులు ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 
 
శరత్ మృతితో వారి కుటుంబం తీవ్రవిషాదంలో ఉంది. వాసవీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసిన శరత్ హైటెక్ సిటీలోని సెగాసిస్టం వరల్డ్ వైడ్ కంపెనీలో కొంతకాలం జాబ్ చేశారు. అయితే ఉన్నత విద్య కోసం జనవరి-2018లో అమెరికా వెళ్లాడు. శరత్‌పై కాల్పులు జరిపింది ఓ నల్లజాతీయుడిగా పోలీసులు గుర్తించారు. అనుమానితుడి వీడియో ఫుటేజీని విడుదల చేశారు. శరత్ భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments