శ్రీలంకలో అత్యవసర పరిస్థితిని ఎత్తివేసిన ప్రభుత్వం

Webdunia
శనివారం, 21 మే 2022 (17:23 IST)
ఆర్థిక సంక్షోభంలో కూరుకుని ప్రజల తిరుగుబాటులో ఎమర్జెన్సీలోకి వెళ్లిన శ్రీలంకలో పరిస్థితులు ఇపుడిపుడే చక్కబడుతున్నాయి. దీంతో గత రెండు వారాలుగా అమల్లో ఉన్న అత్యవసర పరిస్థితిని ఆ దేశ ప్రభుత్వం ఎత్తివేసింది. పైగా, ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. 
 
తీవ్ర ఆర్థిక సంక్షోభం కోరల్లో చిక్కుకున్న శ్రీలంక.. ప్రజలకు నిత్యావసరాలను కూడా అందించలేని దయనీయ స్థితిలోకి వెళ్లింది. ఇప్పటికే అలాంటి గడ్డు పరిస్థితులే నెలకొనివున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన బాటపట్టారు. వారిని అదుపు చేసేందుకు వీలుగా ఎమర్జెన్సీని విధించారు. మే ఆరో తేదీ నుంచి అమల్లోకి తెచ్చారు. హింసాత్మక చర్యలకు పాల్పడేవారిని నిర్బంధంలోకి తీసుకునేందుకు పోలీసులు విశేష అధికారాలను కల్పిస్తూ ఆ దేశ అధ్యక్షుడు గొటబాయి రాజపక్స ఉత్తర్వులు జారీచేశారు. 
 
అయితే ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో దేశంలో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయని భావించిన దేశాధ్యక్షుడు ఎమర్జెన్సీని ఎత్తివేసినట్టు స్థానిక మీడియా హిరు న్యూస్ వెల్లడించింది. కాగా, ప్రజా తిరుగుబాటుతో ఆ దేశ ప్రధానిగా ఉన్న మహీందా రాజపక్స తన పదవికి రాజీనామా చేయగా, ఆయన స్థానంలో రణిల్ విక్రమ సింఘే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments