Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకలో అత్యవసర పరిస్థితిని ఎత్తివేసిన ప్రభుత్వం

Webdunia
శనివారం, 21 మే 2022 (17:23 IST)
ఆర్థిక సంక్షోభంలో కూరుకుని ప్రజల తిరుగుబాటులో ఎమర్జెన్సీలోకి వెళ్లిన శ్రీలంకలో పరిస్థితులు ఇపుడిపుడే చక్కబడుతున్నాయి. దీంతో గత రెండు వారాలుగా అమల్లో ఉన్న అత్యవసర పరిస్థితిని ఆ దేశ ప్రభుత్వం ఎత్తివేసింది. పైగా, ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. 
 
తీవ్ర ఆర్థిక సంక్షోభం కోరల్లో చిక్కుకున్న శ్రీలంక.. ప్రజలకు నిత్యావసరాలను కూడా అందించలేని దయనీయ స్థితిలోకి వెళ్లింది. ఇప్పటికే అలాంటి గడ్డు పరిస్థితులే నెలకొనివున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన బాటపట్టారు. వారిని అదుపు చేసేందుకు వీలుగా ఎమర్జెన్సీని విధించారు. మే ఆరో తేదీ నుంచి అమల్లోకి తెచ్చారు. హింసాత్మక చర్యలకు పాల్పడేవారిని నిర్బంధంలోకి తీసుకునేందుకు పోలీసులు విశేష అధికారాలను కల్పిస్తూ ఆ దేశ అధ్యక్షుడు గొటబాయి రాజపక్స ఉత్తర్వులు జారీచేశారు. 
 
అయితే ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో దేశంలో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయని భావించిన దేశాధ్యక్షుడు ఎమర్జెన్సీని ఎత్తివేసినట్టు స్థానిక మీడియా హిరు న్యూస్ వెల్లడించింది. కాగా, ప్రజా తిరుగుబాటుతో ఆ దేశ ప్రధానిగా ఉన్న మహీందా రాజపక్స తన పదవికి రాజీనామా చేయగా, ఆయన స్థానంలో రణిల్ విక్రమ సింఘే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

Mad Gang: నవ్వించడమే లక్ష్యంగా తీసిన సినిమా మ్యాడ్ స్క్వేర్ : మ్యాడ్ గ్యాంగ్

Rajendra Prasad: డేవిడ్ వార్నర్‌పై పచ్చి బూతులు: రాజేంద్ర ప్రసాద్.. మందేసి అలా మాట్లాడారా? (video)

రష్మికకు లేని నొప్పి - బాధ మీకెందుకయ్యా? మీడియాకు సల్మాన్ చురకలు!! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments