Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకలో అత్యవసర పరిస్థితిని ఎత్తివేసిన ప్రభుత్వం

Webdunia
శనివారం, 21 మే 2022 (17:23 IST)
ఆర్థిక సంక్షోభంలో కూరుకుని ప్రజల తిరుగుబాటులో ఎమర్జెన్సీలోకి వెళ్లిన శ్రీలంకలో పరిస్థితులు ఇపుడిపుడే చక్కబడుతున్నాయి. దీంతో గత రెండు వారాలుగా అమల్లో ఉన్న అత్యవసర పరిస్థితిని ఆ దేశ ప్రభుత్వం ఎత్తివేసింది. పైగా, ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. 
 
తీవ్ర ఆర్థిక సంక్షోభం కోరల్లో చిక్కుకున్న శ్రీలంక.. ప్రజలకు నిత్యావసరాలను కూడా అందించలేని దయనీయ స్థితిలోకి వెళ్లింది. ఇప్పటికే అలాంటి గడ్డు పరిస్థితులే నెలకొనివున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన బాటపట్టారు. వారిని అదుపు చేసేందుకు వీలుగా ఎమర్జెన్సీని విధించారు. మే ఆరో తేదీ నుంచి అమల్లోకి తెచ్చారు. హింసాత్మక చర్యలకు పాల్పడేవారిని నిర్బంధంలోకి తీసుకునేందుకు పోలీసులు విశేష అధికారాలను కల్పిస్తూ ఆ దేశ అధ్యక్షుడు గొటబాయి రాజపక్స ఉత్తర్వులు జారీచేశారు. 
 
అయితే ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో దేశంలో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయని భావించిన దేశాధ్యక్షుడు ఎమర్జెన్సీని ఎత్తివేసినట్టు స్థానిక మీడియా హిరు న్యూస్ వెల్లడించింది. కాగా, ప్రజా తిరుగుబాటుతో ఆ దేశ ప్రధానిగా ఉన్న మహీందా రాజపక్స తన పదవికి రాజీనామా చేయగా, ఆయన స్థానంలో రణిల్ విక్రమ సింఘే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allari Naresh,: అల్లరి నరేష్, రుహాని శర్మ థ్రిల్లర్ డ్రామా గా ఆల్కహాల్

Madrasi Review: మురుగదాస్ మదరాసి ఎలా వుందో తెలుసా.. మదరాసి రివ్యూ

అనుష్క, క్రిష్ సినిమా ఘాటీ ఎలా ఉందంటే? రివ్యూ

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments