Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈస్టర్ సండే పేలుళ్లు : 310కి చేరిన మృతులు... 40 మంది అనుమానితుల అరెస్టు

Webdunia
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (11:40 IST)
శ్రీలంకలో ఈస్టర్ సండే రోజున వరుస బాంబు పేలుళ్లు జరుగగా, ఈ పేలుళ్ళలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మంగళవారానికి 310కి చేరింది. ఈ పేలుళ్ళలో గాయపడిన క్షతగాత్రుల్లో అనేకమంది పరిస్థితి మరింత విషమంగా ఉంది. ఇకపోతే, ఈ పేలుళ్ళకు సూత్రధారులుగా భావిస్తున్న 40 మంది అనుమానితులను శ్రీలంక భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరంతా శ్రీలంక జాతీయులే కావడం గమనార్హం. 
 
మరోవైపు, సోమవారం అర్థరాత్రి నుంచి శ్రీలంకలో ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది. దీంతో భద్రతా బలగాలు ఆ దేశంలోని ప్రతి అంగుళాన్ని జల్లెడ పడుతున్నాయి. ఇంకోవైపు, విదేశీ దౌత్యవేత్తలు, హైకమిషనర్లతో శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన భేటీకానున్నారు. ఈ సందర్భంగా పేలుళ్ళ గురించి వారికి వివరించడమే కాకుండా అంతర్జాతీయ దౌత్య సహకారాన్ని ఆయన కోరనున్నారు. 
 
ఇదిలావంటే, ఈ పేలుళ్ళ వెనుక ఐసిస్ హస్తమున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ముగ్గురు అనుమానితుల ఛాయాచిత్రాలను విడుదల చేసింది. అంతేకాకుండా, స్థానిత తీవ్రవాద సంస్థకు ఐసిస్ ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఈ పేలుళ్ళపై శ్రీలంక అంతర్జాతీయ దర్యాప్తును కోరే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments