ఈస్టర్ సండే పేలుళ్లు : 310కి చేరిన మృతులు... 40 మంది అనుమానితుల అరెస్టు

Webdunia
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (11:40 IST)
శ్రీలంకలో ఈస్టర్ సండే రోజున వరుస బాంబు పేలుళ్లు జరుగగా, ఈ పేలుళ్ళలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మంగళవారానికి 310కి చేరింది. ఈ పేలుళ్ళలో గాయపడిన క్షతగాత్రుల్లో అనేకమంది పరిస్థితి మరింత విషమంగా ఉంది. ఇకపోతే, ఈ పేలుళ్ళకు సూత్రధారులుగా భావిస్తున్న 40 మంది అనుమానితులను శ్రీలంక భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరంతా శ్రీలంక జాతీయులే కావడం గమనార్హం. 
 
మరోవైపు, సోమవారం అర్థరాత్రి నుంచి శ్రీలంకలో ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది. దీంతో భద్రతా బలగాలు ఆ దేశంలోని ప్రతి అంగుళాన్ని జల్లెడ పడుతున్నాయి. ఇంకోవైపు, విదేశీ దౌత్యవేత్తలు, హైకమిషనర్లతో శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన భేటీకానున్నారు. ఈ సందర్భంగా పేలుళ్ళ గురించి వారికి వివరించడమే కాకుండా అంతర్జాతీయ దౌత్య సహకారాన్ని ఆయన కోరనున్నారు. 
 
ఇదిలావంటే, ఈ పేలుళ్ళ వెనుక ఐసిస్ హస్తమున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ముగ్గురు అనుమానితుల ఛాయాచిత్రాలను విడుదల చేసింది. అంతేకాకుండా, స్థానిత తీవ్రవాద సంస్థకు ఐసిస్ ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఈ పేలుళ్ళపై శ్రీలంక అంతర్జాతీయ దర్యాప్తును కోరే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rana: దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే.. కాంత ఫస్ట్ సింగిల్ కు రెస్పాన్స్

షాప్ ఓనర్ నన్ను చూసి విక్రమ్‌లా ఉన్నారు అన్నారు : బైసన్ హీరో ధృవ్ విక్రమ్

Rana Daggubati: మిరాయ్ సీక్వెల్ లో రానా దగ్గుబాటి కీలకం అంటున్న తేజ సజ్జా

RT76: స్పెయిన్‌లో రవితేజ తో సాంగ్ పూర్తిచేసుకున్న ఆషికా రంగనాథ్

నిర్మాతలు ఆర్టిస్టులను గౌరవించడం లేదు : హీరో నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments