Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేదికపైనే అగ్నికి ఆహుతైన గాయని.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (09:52 IST)
ఓ గాయని వేదికపైనే అగ్నికి ఆహుతైంది. ఈ విషాదకర ఘటన స్పెయిన్‌లో సంభవించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రముఖ స్పానిష్‌ పాప్‌స్టార్‌, డాన్సర్‌ జోయానా సెయిన్స్‌లు కలిసి సూపర్ హాలీవుడ్ ఆర్కెస్ట్రా  బృందంతో సంగీత విభావరి కార్యక్రమంలో పాల్గొన్నారు. అపుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా బాణాసంచా పేలిపోయింది. దీంతో వేదికకు మంటలు అందుకుని గాయని సజీవదహనమైంది.
 
ఈ ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షులు అందించిన సమాచారం మేరకు... బాణాసంచా కాల్చుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ రెండు రాకెట్లు వేదికపై దూసుకు వచ్చాయి. ఒకటి ఏకంగా ఆమె కడుపులోకి దూసుకుపోయింది. దీంతో వేదిక మీద ఒక్కసారిగా పేలుడు, సంభవించి మంటలంటుకోవడంతో ఆ మంటల్లో జోయానా చిక్కుకు పోయారు. 
 
అపస్మారక స్థితిలోకి జారుకున్న ఆమెను ఆసుపత్రికి తరలించే సమయానికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై కేస నమోదు చేసిన పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. జోయానా ఆకస్మిక మరణంపై గ్రూప్‌ ప్రమోటర్లు, హాలీవుడ్ నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, సంతాపం తెలిపారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments