Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యసభలో తొలిసారిగా అడుగుపెట్టనున్న సోనియా గాంధీ

సెల్వి
బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (11:57 IST)
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. రాజ్యసభలో స్థానం సంపాదించిన రెండవ గాంధీ కుటుంబ సభ్యురాలిగా ఆమె నిలిచారు. రాజ్యసభ సభ్యురాలిగా సోనియా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజస్థాన్‌లోని రాజ్యసభ నియోజకవర్గంలో ఆమె పోటీ చేశారు. 
 
సోనియా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాజస్థాన్ అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 1999లో సోనియా గాంధీ తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఆమె ఆగస్టు 1964 నుండి ఫిబ్రవరి 1967 వరకు ఎగువ సభలో సభ్యునిగా ఉన్న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత రాజ్యసభలో ప్రవేశించిన గాంధీ కుటుంబంలో 2వ సభ్యురాలు.
 
రాజస్థాన్‌లో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ కావడంతో నోటిఫికేషన్ విడుదలైంది. భూపేంద్ర యాదవ్ (బిజెపి), మన్మోహన్ సింగ్ (కాంగ్రెస్) పదవీకాలం ఏప్రిల్ 3వ తేదీతో ముగియనుండగా, బిజెపి సభ్యుడు కిరోడి లాల్ మీనా ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రాజ్యసభకు రాజీనామా చేశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments