సోమాలియాలో హోటల్‌పై ఆత్మహుతి దాడి.. 32 మంది మృతి

సెల్వి
శనివారం, 3 ఆగస్టు 2024 (17:03 IST)
సోమాలియా దేశంలోని ఓ హోటల్‍పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 32 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. అలాగే పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది తామేనంటూ అల్ ఖైదా ఉగ్ర సంస్థకు చెందిన అనుబంధ విభాగం అల్ షబాబ్ ప్రకటించింది. 
 
ఆఫ్రికా ఖండంలో అత్యంత పేద, కల్లోలభరిత దేశంగా గుర్తింపు పొందిన సోమాలియాలో ఉగ్రవాదులు పెట్రేగిపోతున్నారు. తాజాగా ఓ హోటల్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 63 మందికి గాయాలయ్యాయి. ఈ ఉగ్రదాడికి తామే బాధ్యలమంటూ అల్ షబాబ్ ప్రకటించింది. 
 
సోమాలియా రాజధాని మొగదిషు నగరంలోని లిడో బిచ్‌కు సమీపంలో ఉన్న ఈ హోటల్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు వంటినిడా పేలుడు పదార్థాలు అమర్చుకుని తనను తాను పేల్చుకున్నాడు. భద్రతా బలగాలు స్పందించి కాల్పులు జరపడంతో నలుగురు సాయుధ ఉగ్రవాదులు మరణించారు. మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments