Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్తాన్ మంత్రి హసన్ లంజార్ ఇంటికి నిప్పు, దరిద్రుడు మా నీళ్లు మళ్లిస్తున్నాడంటూ సింధ్ ప్రజలు ఫైర్

ఐవీఆర్
గురువారం, 22 మే 2025 (18:26 IST)
పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. తమ ప్రాంతానికి వచ్చే నీళ్లను ప్రాజెక్టు నిర్మించి పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్‌కి మళ్లించేందుకు పాకిస్తాన్ సింధ్ హోం మంత్రి జియా ఉల్ హసన్ లంజార్ కుట్ర చేస్తున్నారంటూ అక్కడి ప్రజలు మంత్రి ఇంటికి నిప్పు పెట్టారు. అంతేకాదు... దరిద్రుడు, మా పాలిట పడ్డ పనికిమాలిన మంత్రి అంటూ దూషించారు. ఇంకొందరైతే రోడ్లపైకి వచ్చి AK 47 తుపాకులను చేతపట్టుకుని మా నీళ్లను ఎలా మళ్లిస్తారో చూస్తాం అంటూ ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణల్లో కనీసం ఇద్దరు పాకిస్తాన్ పౌరులు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. 
 
ప్రస్తుతం తమ ప్రాంతానికి వస్తున్న నీరే తమకు సరిపోవడం లేదనీ, అలాంటిది ఈ నీటిని మరో ప్రాంతానికి ఎలా తరలిస్తారంటూ సింధ్ ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మా ప్రాంత రైతులు పంటలకు నీళ్లు లేక విలవిలలాడుతుంటూ చూడాలని అనుకుంటున్నారా... అది ఎంతమాత్రం సాధ్యం కాదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
సింధ్ ప్రజల దెబ్బకు జడుసుకున్న మంత్రి పారామిలటరీ బృందాలను రంగంలోకి దింపారు. హింసాయుత కార్యకలాపాలకు పాల్పడుతున్నవారిని అణచివేయాలంటూ ఆదేశాలు జారీ చేసారు. దీనితో సింధ్ ప్రజలు మరింత ఆగ్రహం చెంది మిలటరీ బలగాలపై ఎదురుదాడికి దిగుతున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి  అల్లకల్లోలంగా వున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments