Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్ సీఈవోగా నేను తప్పుకోవాలా? వద్దా? ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ పోల్

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (11:26 IST)
మైక్రోమెసేజింగ్ యాప్ ట్విట్టర్‌ను తన సొంతం చేసుకున్న తర్వాత ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్... ట్విట్టర్‌లో అనేక సంస్కరణకు శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా, సరికొత్త మార్పులకు ఆయన శ్రీకారం చుడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ సీఈవోగా తాను ఉండాలా? వద్దా? అనే అంశంపై ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ఆయన ట్విట్టర‌లో ఓ పోల్ పెట్టారు. 
 
ఈ పోల్‌లో నెటిజన్లు వద్దంటే సీఈవో పోస్టు నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. ఈ పోల్‌కు నెటిజన్లు స్పందిస్తున్నారు. ఫలితంగా సోమవారం ఉదయం వరకు 56 శాతం మంది తప్పుకోవడమే ఉత్తమమని సెలవిచ్చారు. మరో 44 శాతం మంది ట్విట్టర్ యూజర్లు మాత్రం సంస్థ సీఈవోగా మస్క్ కొనసాగాలని అభిప్రాయపడ్డారు. 
 
కాగా, గతంలో కూడా ట్విట్టర్ బ్యాన్ చేసిన వ్యక్తులను తిరిగి ఆహ్వానించే విషయంపై కూడా మస్క్ ట్విట్టర్‌లో పోల్ నిర్వహించారు. ఇందులో వచ్చిన ఫలితాల ఆధారంగా నిర్ణయం తీసుకున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌‌పై ట్విట్టర్ నిషేధం ఎత్తివేత కూడా ఇందులోభాగంగా తీసుకున్న నిర్ణయమే కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments