ట్విట్టర్ సీఈవోగా నేను తప్పుకోవాలా? వద్దా? ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ పోల్

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (11:26 IST)
మైక్రోమెసేజింగ్ యాప్ ట్విట్టర్‌ను తన సొంతం చేసుకున్న తర్వాత ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్... ట్విట్టర్‌లో అనేక సంస్కరణకు శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా, సరికొత్త మార్పులకు ఆయన శ్రీకారం చుడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ సీఈవోగా తాను ఉండాలా? వద్దా? అనే అంశంపై ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ఆయన ట్విట్టర‌లో ఓ పోల్ పెట్టారు. 
 
ఈ పోల్‌లో నెటిజన్లు వద్దంటే సీఈవో పోస్టు నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. ఈ పోల్‌కు నెటిజన్లు స్పందిస్తున్నారు. ఫలితంగా సోమవారం ఉదయం వరకు 56 శాతం మంది తప్పుకోవడమే ఉత్తమమని సెలవిచ్చారు. మరో 44 శాతం మంది ట్విట్టర్ యూజర్లు మాత్రం సంస్థ సీఈవోగా మస్క్ కొనసాగాలని అభిప్రాయపడ్డారు. 
 
కాగా, గతంలో కూడా ట్విట్టర్ బ్యాన్ చేసిన వ్యక్తులను తిరిగి ఆహ్వానించే విషయంపై కూడా మస్క్ ట్విట్టర్‌లో పోల్ నిర్వహించారు. ఇందులో వచ్చిన ఫలితాల ఆధారంగా నిర్ణయం తీసుకున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌‌పై ట్విట్టర్ నిషేధం ఎత్తివేత కూడా ఇందులోభాగంగా తీసుకున్న నిర్ణయమే కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : హారర్‌ కామెడీ యూనివర్స్ చిత్రం థామా అలరిస్తుంది: రష్మిక మందన

Prabhas: ఫన్, ఫియర్, ఆల్ట్రా స్టైలిష్ గా ప్రభాస్ రాజా సాబ్ ట్రైలర్

Sudheer: ముగ్గురు నాయికలుతో సుడిగాలి సుధీర్ హీరోగా హైలెస్సో ప్రారంభం

OG Collections: ఓజీ నాలుగు రోజుల కలెక్లన్లు ప్రకటించిన డివివి ఎంటర్ టైన్ మెంట్

Sonakshi Sinha: జటాధర లో సోనాక్షి సిన్హా పై ధన పిశాచి సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

తర్వాతి కథనం
Show comments