Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్‌లో మరో భారతీయ విద్యార్థి మృతి

Webdunia
బుధవారం, 2 మార్చి 2022 (20:26 IST)
ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య జరుగుతున్న భీకర యుద్ధం కారణంగా భారత పౌరులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. అలాగే, ప్రాణనష్టం కూడా వాటిల్లుతుంది. ఇప్పటికే కర్నాటక రాష్ట్రానికి చెందిన నవీన్ అనే వైద్య విద్యార్థి రష్యా సైనిక బలగాలు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ నేపథ్యంలో తాజాగా పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన చందన్ జిందాల్ అనే 22 యేళ్ళ వైద్య విద్యార్థి మృతి చెందాడు. అనారోగ్య సమస్యలతో చందన్ జిందాల్ కన్నుమూసినట్టు వార్తలు వస్తున్నాయి. రక్తం గడ్డకట్టడంతో చందన్ జిందాల్‌ను తక్షణం సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా జిందాల్ ప్రాణాలు కోల్పోయినట్టు జాతీయ మీడియా వెల్లడించింది. కాగా, జిందాల్ విన్నిత్సియాలోని విన్నిత్సియా నేషనల్ పైరోగవ్ మెమోరియల్ వైద్య విశ్వవిద్యాలయంలో చందన్ జిందాల్ ఎంబీబీఎస్ చదువుతున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments